Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maoists Ready To Surrender In Chhattisgarh Seek Security Political Recognition

Maoist Party: “మాకు భద్రత కల్పించండి.. అందరం లొంగిపోతాం”.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టుల విజ్ఞప్తి..

Published Date :February 24, 2026 , 11:38 am
By RAMAKRISHNA KENCHE
Maoist Party: “మాకు భద్రత కల్పించండి.. అందరం లొంగిపోతాం”.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టుల విజ్ఞప్తి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maoist Party: మావోస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తులు చేశారు. తమకు భద్ర కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ గృహ మంత్రి విజయ్ శర్మకు CPI (మావోయిస్టు) పశ్చిమ సబ్‌జోన్ బ్యూరోకు చెందిన కీలక నేత వికాస్ లేఖ రాశారు. ఆయుధాలతో సహా ప్రధాన ప్రవాహంలోకి చేరేందుకు సిద్ధమని ఆ లేఖలో వెల్లడించారు. బలాంగిర్–బర్గఢ్–మహాసముంద్ ప్రాంతాలకు చెందిన BBM డివిజన్ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ప్రజా యుద్ధం కొనసాగించడం సరైన మార్గం కాదని, భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయడమే ప్రజలకు మేలు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ భద్రతపై ప్రభుత్వ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ.. ఆ హామీని రేడియో ద్వారా నేరుగా వినాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత రెండు నుంచి మూడు రోజుల్లో బయటకు వచ్చి లొంగిపోతామని తెలిపారు. ఇప్పటికే మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ, 28 రోజుల ముందుగానే మహాసముంద్ జిల్లాలో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

READ MORE: Samantha : నాగ చైతన్యతో ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ పై సమంత ఎమోషనల్

Also Read

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

అంతేకాదు.. లొంగుబాటు చేసిన మావోయిస్టులను ఇళ్లకు పంపకుండా బారక్కుల్లో ఉంచుతున్నారని, గడువు ముగిసిన తరువాత మళ్లీ కేసుల్లో ఇరికించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే మీడియా ద్వారా లొంగుబాటు నిర్ణయం ప్రకటించిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో కూంబింగ్, ఎన్‌కౌంటర్ ఘటనలు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలో లొంగుబాటు చేయాలా, ఛత్తీస్‌గఢ్‌లో చేయాలా అన్న అంశంపై చర్చ జరిగినప్పటికీ, తమకు చెందిన ఇతర సభ్యుల అభిప్రాయంతో చివరికి ఛత్తీస్‌గఢ్‌కే రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక బృందం ముందుగా వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని, మిగతా సభ్యులు దశలవారీగా చేరతారని పేర్కొన్నారు.

READ MORE: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

ప్రభుత్వం ప్రకటించాల్సిన మూడు అంశాలు:
1. సాయుధ పోరాటాన్ని విరమించి రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన మావోయిస్టు పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలి.
2. మావోయిస్టులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకొని, జైళ్లలో ఉన్నవారిని విడుదల చేయాలి.
3. భారత రాజ్యాంగ పరిధిలో బహిరంగంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలి.

ఈ మూడు ప్రకటనలు చేస్తే జైళ్లలో ఉన్నవారు కూడా సాయుధ పోరాటాన్ని విడిచిపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పోలీసు చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తాము బయటకు వచ్చే వరకు గ్రామాల్లో కూంబింగ్ ఆపాలని, ప్రజలపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒడిశా రాష్ట్రంలోని బలాంగిర్, బర్గఢ్ జిల్లాల్లో కూడా పోలీసు ఆపరేషన్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో లొంగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు, మాజీ మావోయిస్టు సాగర్ ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని లేఖ చివరలో పేర్కొన్నారు.

 

 

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BBM division Maoists
  • Chhattisgarh Maoists latest news
  • CPI Maoist letter
  • India Maoist updates
  • Maoist political party demand

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions