Site icon NTV Telugu

Manoj Tiwary: హార్దిక్ ఇక చాలు.. కెప్టెన్సీ నుండి తప్పుకొని రోహిత్ కు అప్పగించు.!

Manoj Tiwary

Manoj Tiwary

Manoj Tiwary on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ఫామ్ కొనసాగుతోంది. గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో వెనుకబడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ క్వింటన్ డి కాక్ అద్భుత శతకంతో 195 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా కేవలం 17 ఓవర్లలోనే మ్యాచ్‌ ను ముగించింది.

ఈ మ్యాచ్‌ లో ముంబై జట్టు బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోయినా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టుకు భారీగా నష్టాన్ని కలిగించాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ నిర్ణయం మ్యాచ్ మలుపు తిప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమన్ ధీర్ అవుట్ అయిన తర్వాత, ఫామ్‌ లో ఉన్న షెర్ఫేన్ రదర్‌ ఫోర్డ్‌ ను పంపకుండా హార్దిక్ స్వయంగా క్రీజ్‌లోకి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఫామ్‌పై మౌనం వీడిన ముంబై ఇండియన్స్.. కోచ్ ఏమన్నారంటే..?

రదర్‌ఫోర్డ్ ఆర్సీబీపై 31 బంతుల్లో 71 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ అతనికి తక్కువ బంతులు మాత్రమే లభించగా, హార్దిక్ మాత్రం 12 బంతుల్లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ నిర్ణయం కారణంగా ముంబై 200కి పైగా స్కోర్ చేయగలిగే అవకాశం కూడా కోల్పోయింది. ఈ విషయమై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి హార్దిక్ కెప్టెన్సీపై తీవ్రంగా మండిపడ్డాడు. మ్యాచ్‌ లో కీలక సమయంలో తీసుకున్న నిర్ణయాలు అర్థరహితంగా ఉన్నాయని, జస్ప్రీత్ బుమ్రాను సరిగా వినియోగించకపోవడం కూడా పెద్ద లోపమని పేర్కొన్నాడు.

జట్టు ఓడిపోతే బాధ్యత తీసుకోవాలి. హార్దిక్ తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా అనిపించడం లేదు. రదర్‌ ఫోర్డ్‌ ను ముందుగా పంపాల్సింది, అలాగే బుమ్రాను స్ట్రాటజిక్‌ గా ఉపయోగించలేదని, కెప్టెన్సీలో బలహీనత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. అంతేకాక, ముంబై ఇండియన్స్ సమస్యలకు పరిష్కారం కావాలంటే హార్దిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని తివారి సూచించాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడని.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో టైటిల్స్ గెలిచిందని గుర్తు చేశారు.

T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

అయితే ముంబై మేనేజ్మెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకుని కెప్టెన్‌గా నియమించింది. గుజరాత్‌ కు 2022లో టైటిల్ అందించిన హార్దిక్, ముంబై తరఫున మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో 19 ఓటములు చవిచూసింది.

Exit mobile version