Lok Sabha Elections 2024: ఇంటి నుంచే ఓటేసిన మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా.. మిగిలిన మూడు దశల ఓటింగ్కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. మే 25న ఢిల్లీలో ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, శుక్రవారం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్ న్యూఢిల్లీ లోక్సభ స్థానానికి తమ ఇంటి నుంచే ఓటు వేశారు.
READ MORE: Uttarakhand : ఇంటి బయట ఆడుకుంటుండగా పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత
Also Read
జిల్లా ఎన్నికల కార్యాలయ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఓటింగ్ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇంటికి కూడా ఎన్నికల అధికారులు చేరుకున్నారు. అతనూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం (CEO) 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల (PWD) కోసం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయం మే 24 వరకు కొనసాగుతుంది.
ఢిల్లీలో 5,472 మంది వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వారు ఇంటి నుంచే ఓటేసేందుకు ఫారం 12Dని నింపారు. ఢిల్లీ ఎన్నికల సంఘం సీఈఓ కూడా ఇంటి వద్దే ఓటు వేయాలనుకునే ఓటర్ల కోసం సన్నాహాలు చేశారు. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియలో ఓటింగ్ సమయంలో అత్యంత గోప్యత, సమగ్రతను కాపాడేందుకు పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది వారి వెంట ఉంటారు. శారీరక పరిమితులు లేదా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడి స్వరం లెక్కించబడే న్యాయమైన ప్రజాస్వామ్యాన్ని నిర్ధారిస్తామని ఎన్నికల సంఘం (ECI) హామీ ఇస్తుంది. ఇంటికి వెళ్లేముందు వారి చరవాణులకు షెడ్యూల్ మెసేజ్ రూపంలో పంపుతారు. మొత్తం ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేయబడుతుంది.
- Tags
- CEO
- Delhi
- EC
- from home
- Hamid Ansari
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!