Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను చంపేందుకు బీజేపీ భారీ కుట్రలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే భారతీయ జనతాపార్టీ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలోనే సీఎం కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పై దాడి చేయాలని ఇప్పటికే తన గూండాలను మనోజ్ తివారీ పురమాయించినట్లు బహిరంగంగా చెప్పారని… ఇప్పటికే పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారని తెలిపారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదని హెచ్చరించారు. బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టి.. ఎన్నికల్లో ఓడిస్తారని జోస్యం పలికారు.
Read Also: MallaReddy IT Raids: మల్లారెడ్డి ఎన్ని కోట్లు పోగేశాడో… విచారణలో తేల్చనున్న అధికారులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి మనోజ్ తివారీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మనీశ్ సిసోడియా ఈ ఆరోపణలు చేశారు. అంతులేని అవినీతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, రేపిస్టులతో స్నేహం, జైల్లో ఆప్ మంత్రికి సకల సౌకర్యాలతో మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కేజ్రీవాల్ భద్రతపై తనకు ఆందోళనగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలను ప్రజలు చితకబాదిన ఘటనలను కూడా చూశామని… ఇలాంటి అనుభవం ఢిల్లీ సీఎంకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు.