Manipur Violence: మణిపూర్లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!
- రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి
- మణిపూర్లో మళ్లీ రాజుకున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి మచ్చుకైనా కనిపించడం లేదు. గత కొంతకాలంగా కొనసాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు మరోసారి హింసాత్మక రూపం దాల్చాయి. తాజాగా జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో పలు జిల్లాల్లో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన రాకెట్ దాడులు నివాస ప్రాంతాలపై పడటంతో ఈ ఘోరం జరిగింది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.
READ ALSO: Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!
పరిస్థితి విషమించకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించింది. హింస ప్రభావిత జిల్లాల్లో తక్షణమే అమలులోకి వచ్చేలా కర్ఫ్యూ విధించారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించి హింస మరింత పెరగకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. డ్రోన్ల సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏడాదికి పైగా సాగుతున్న ఈ అంతర్గత హింస మణిపూర్ అభివృద్ధిని, సామాన్య ప్రజల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అప్పుడప్పుడు జరుగుతున్న ఇటువంటి దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. తాజా ఘటనతో ఇంఫాల్ లోయలో మళ్లీ భయానక వాతావరణం నెలకొంది.
READ ALSO: Congress vs TMC: బెంగాల్లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..
తాజావార్తలు
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.