Manipur Violence: మణిపుర్లో ఘోరం.. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య! పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Students Killed in Manipur who missing in July: మణిపుర్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గత జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో మణిపుర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య వైరం కారణంగా అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోయిన సమయంలో ఈ ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు.
మణిపుర్ అల్లర్ల అనంతరం జులై 6వ తేదీన ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో.. అమ్మాయి నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు బాగానే ఉన్నాయని భావించిన ఆమె.. తన స్నేహితుడితో బైక్పై లాంగ్ డ్రైవ్కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంఫాల్కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు అప్పుడు వెల్లడించారు. దాదాపుగా మూడు నెలల అనంతరం ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
Also Read: Kakani Govardhan Reddy: సీఎం చెప్పిన మాట ప్రకారం.. సీజన్కు ముందే గిట్టుబాటు ధర: మంత్రి కాకాణి
అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను మణిపుర్ ప్రభుత్వం గతవారం ఎత్తి వేసింది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో సోమవారం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. విద్యార్థులను సాయుధులు కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటో తెలియజేస్తుండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు ఉన్నట్లు మరో ఫొటోలో కనిపిస్తోంది. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా ఉంది. హత్యకు గురైన విద్యార్థులు మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపుర్ ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!