Manipur Violence: భారీ నిరసనల మధ్య ఇంఫాల్లో కర్ఫ్యూ.. పోలీసు వాహనానికి నిప్పుపెట్టిన గుంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో ఐదు నెలల క్రితం మొదలైన హింసాకాండ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ఇంటర్నెట్, పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఉద్రిక్తత నేపథ్యంలో ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. జూలై నుండి తప్పిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాల ఫోటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో తాజాగా మరోసారి హింస చెలరేగింది. అనంతరం ఇక్కడ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. మొదట ఇంఫాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సింగ్జీ వీధుల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. బుధవారం (సెప్టెంబర్ 27) కూడా నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు, భద్రతా బలగాలు గాయపడ్డారు.
ఆందోళనకారులకు గాయాలైన సంఘటనల గురించి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడుతూ, “భద్రతా దళాలు బుల్లెట్లు లేదా ఏదైనా మారణాయుధాలను ఉపయోగించకూడదు.. అలా చేస్తే ప్రభుత్వం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది. తీవ్రగాయాలు జరిగితే విచారణ జరిపి న్యాయం చేస్తామని.. భద్రతా బలగాలపై దుండగులు ఇనుముతో తయారు చేసిన వస్తువులను విసిరినట్లు తమకు సమాచారం అందిందని, దీంతో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. “ఒక గుంపు ఒక నాయకుడి ఇంటిపై దాడికి ప్రయత్నించింది” అని మణిపూర్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విటర్లో రాత్రి 9.30 గంటల సమయంలో పోస్ట్ చేశారు. దానిని నియంత్రించేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి జనాన్ని చెదరగొట్టాయి. అదుపు చేయలేని గుంపు పోలీసు జిప్సీని దహనం చేసింది. ఓ పోలీసును కొట్టి అతని ఆయుధాన్ని లాక్కెళ్లారని పోలీసులు తెలిపారు. మణిపూర్ పోలీసులు ఇటువంటి చర్యలను ఖండిస్తున్నారని, అటువంటి దుర్మార్గులను ఎదుర్కోవటానికి కఠిన చర్యలు తీసుకుంటారు. ఆయుధాలు స్వాధీనం చేసుకుని దుండగులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
Read Also:CM KCR : ‘గంగా జమున తెహజీబ్’ ను మరోసారి ప్రపంచానికి చాటాలి
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>An unruly crowd tried to attack the house of a political leader, the joint security forces repelled the crowd by firing tear gas shells. The unruly crowd targeted a police gypsy and burnt it, while assaulting a policeman and snatched his weapon. Manipur Police condemns such…</p>— Manipur Police (@manipur_police) <a href=”https://twitter.com/manipur_police/status/1707063586097651785?ref_src=twsrc%5Etfw”>September 27, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
ఇంతలో మణిపూర్లోని ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వం కూడా శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేసును సీబీఐకి అప్పగించింది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని ఏజెన్సీ అధికారుల బృందం బుధవారం (సెప్టెంబర్ 27) వచ్చిందన్నారు. ఈ బృందం ఇద్దరు అదృశ్యమైన యువకుల హత్య కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి హత్య చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. అమిత్ షా ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్తో కూడా ఫోన్లో మాట్లాడారు.
గడ్డు పరిస్థితిని చూసి, మణిపూర్లోని కొండ ప్రాంతాలలో AFSPA అమలులో ఉంచాలని నిర్ణయించారు. అయితే 19 పోలీస్ స్టేషన్ ప్రాంతాలను AFSPA నుండి వేరుగా ఉంచారు. వీటిలో ఇంఫాల్, లెన్ఫ్లే, సిటీ, సింగ్మెయి, సెక్మై, లాంసాంగ్, పట్సోయి, వాంగోయి, పోరోంపట్, హాంగెంగ్, లామ్లై, ఇరిల్బంగ్, లెమ్ఖోంగ్, థోబుల్, బిష్ణుపూర్, నంబోల్, మోయిరోంగ్, కక్చింగ్ మరియు జిరిబామ్ ఉన్నాయి. మణిపూర్లో అక్టోబర్ 1 రాత్రి 7.45 గంటల వరకు ఇంటర్నెట్ను నిషేధించారు. మే 3న చెలరేగిన హింసాకాండతో రాష్ట్రంలో ఇంటర్నెట్ నిషేధం విధించబడింది. నాలుగు నెలల తర్వాత మళ్లీ నిషేధం విధించబడింది. శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27, 29 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 28న ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ సెలవుదినం.
తాజా హింసాకాండపై కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. రాష్ట్ర అసమర్థ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మణిపూర్లో 147 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రధాని మోదీకి ఆ రాష్ట్రాన్ని సందర్శించే సమయం లేదని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ హింసలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న భయానక చిత్రాలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ వివాదంలో మహిళలు, పిల్లలపై హింస ఆయుధమైందని ఇప్పుడు స్పష్టమైంది. మణిపూర్లో మే 3న మొదలైన హింసాత్మక ఘటనల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 65 వేల మందికి పైగా ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.
Read Also:Nasser: జీవచ్ఛంలా కన్నకొడుకు.. నాజర్ జీవితంలో ఇంత విషాదమా.. ?
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!