Manipur : మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురు మృతి.. ఇంఫాల్లో కర్ఫ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీని తరువాత రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు నాలుగు చక్రాల వాహనాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని ముష్కరులు లిలాంగ్ చింగ్జావో ప్రాంతానికి చేరుకుని స్థానిక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Read Also:Gold Price Today : స్థిరంగా పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఇవి ఎవరి కార్లు అనే సమాచారం మాత్రం లభ్యం కాలేదు. తాజా హింసాకాండ తర్వాత తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను మళ్లీ విధించినట్లు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఒక వీడియో సందేశంలో హింసను ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు, ముఖ్యంగా లిలాంగ్ నివాసితులకు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.
Read Also:Health Tips : చలికాలంలో జామ ఆకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
180 మందికి పైగా మృతి
మే 3, 2023 న మణిపూర్లో కుల హింస చెలరేగినప్పటి నుండి 180 మందికి పైగా మరణించారు. అనేక వందల మంది గాయపడ్డారు. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్కు నిరసనగా కొండ జిల్లాల్లో నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ తర్వాత హింస మొదలైంది. మణిపూర్ జనాభాలో మెయిటీ ప్రజల సంఖ్య 53 శాతం, వారు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజన నాగాలు, కుకీలు 40 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు. వారు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?