Manipur : మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురు మృతి.. ఇంఫాల్లో కర్ఫ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీని తరువాత రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు నాలుగు చక్రాల వాహనాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని ముష్కరులు లిలాంగ్ చింగ్జావో ప్రాంతానికి చేరుకుని స్థానిక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Read Also:Gold Price Today : స్థిరంగా పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
దాడి అనంతరం ఆగ్రహించిన స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఇవి ఎవరి కార్లు అనే సమాచారం మాత్రం లభ్యం కాలేదు. తాజా హింసాకాండ తర్వాత తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను మళ్లీ విధించినట్లు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఒక వీడియో సందేశంలో హింసను ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు, ముఖ్యంగా లిలాంగ్ నివాసితులకు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.
Read Also:Health Tips : చలికాలంలో జామ ఆకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
180 మందికి పైగా మృతి
మే 3, 2023 న మణిపూర్లో కుల హింస చెలరేగినప్పటి నుండి 180 మందికి పైగా మరణించారు. అనేక వందల మంది గాయపడ్డారు. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్కు నిరసనగా కొండ జిల్లాల్లో నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ తర్వాత హింస మొదలైంది. మణిపూర్ జనాభాలో మెయిటీ ప్రజల సంఖ్య 53 శాతం, వారు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజన నాగాలు, కుకీలు 40 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు. వారు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!