Manipur Violence: మణిపూర్ హింసాకాండలో చనిపోయిన వారికి రూ.10లక్షలు.. ఇంటికో ఉద్యోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మే 3న మణిపూర్లో చెలరేగిన హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. దీంతో పాటు మృతుల కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. పరిహారం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. ఈ మేరకు మంగళవారం అధికారులు సమాచారం అందించారు. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మధ్య జరిగిన సమావేశం తరువాత పరిహారం ప్రకటించారు. అలాగే వంటగ్యాస్, పెట్రోలు, బియ్యం, ఆహారోత్పత్తులు వంటి వాటిని తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి షాతో పాటు హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా కూడా పాల్గొన్నారు.
Also Read
మణిపూర్లో శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నామని అమిత్ షా అన్నారు. అదే సమయంలో మంగళవారం మణిపూర్లో పలువురు మహిళా నేతలతో కేంద్ర హోంమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నామన్నారు. మణిపూర్లో పౌర సమాజ సంస్థల ప్రతినిధి బృందాన్ని కూడా అమిత్ షా కలిశారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు, పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్ హింసను ప్రస్తావిస్తూ, మణిపూర్లో పరిస్థితిని మెరుగుపరచడానికి సమయం పడుతుందని సిడిఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. మణిపూర్లో ఈ నెల 3న మెయిటీ కమ్యూనిటీ ప్రజలను ఎస్టీలో చేర్చడానికి ‘గిరిజన ఏక్తా మార్చ్’ చేపట్టారు. ఈ సందర్భంగా హింస చెలరేగింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ దృష్ట్యా 10,000 మందికి పైగా బలగాలను మోహరించారు.
Read Also:Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!