Manipur : డ్రోన్ల ద్వారా బాంబులు.. మణిపూర్లో హైటెక్ దాడులకు దిగిన మిలిటెంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : హింస పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలను మూసివేయాలని మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కేంద్రీయ పాఠశాలలను మూసివేయాలని విద్యా డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో సహా కేంద్రీయ విద్యాలయాలు సెప్టెంబరు 7న మూతపడతాయని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
Read Also:Off The Record: ఆ వైసీపీ ఎంపీ పార్టీ మారుతున్నారా..?
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు రెండు రాకెట్లు పేల్చడంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ‘హైటెక్’ దాడుల తర్వాత ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ వారం ప్రారంభంలో ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో రెండు ప్రదేశాలలో డ్రోన్లను ఉపయోగించి బాంబులు వేశారు. గత ఏడాది మే నుండి రాష్ట్రంలో కుల హింసలో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మిలిటెంట్ల దాడులకు నిరసనగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో శుక్రవారం వేలాది మంది మానవహారాలు ఏర్పాటు చేశారు. బాంబు దాడుల కారణంగా తలెత్తిన అశాంతి దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం సెప్టెంబర్ 7న పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన తొలి రాకెట్ దాడిలో తెల్లవారుజామున 4:30 గంటలకు బిష్ణుపూర్ జిల్లాలోని ట్రోంగ్లావోబీలో రెండు భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు, రెండవ రాకెట్ రద్దీగా ఉండే మొయిరాంగ్ పట్టణంలోని మాజీ ముఖ్యమంత్రి మారెంబామ్ కోయిరెంగ్ నివాస సముదాయంపై పడింది, ఒక వృద్ధుడు మరణించాడు. 13 ఏళ్ల బాలికతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.
Read Also:Off The Record: విజయనగరం, నెల్లిమర్ల జనసేనలో విభేదాలు..! పవన్ జన్మదిన వేడుకల సాక్షిగా ఏం జరిగింది?
సెక్యూరిటీ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని సెంట్రల్ ఫోర్స్ అధికారులు చెప్పారు. చురచంద్పూర్ జిల్లాలోని థాంగ్జింగ్ కొండల నుండి దిగువ మొయిరాంగ్ పట్టణం వైపు కాల్పులు జరిపారు. మొయిరాంగ్ పట్టణం, మిగిలిన బిష్ణుపూర్ జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో సంస్థలు మూతపడ్డాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఘర్షణలు జరగకుండా భద్రతా ఏర్పాట్లలో లోపాలను ఈ దాడులు బయటపెట్టాయని ఓ అధికారి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే టి.శాంతి, మంత్రి ఎల్. సుషీన్రో మైతేయ్ ఘటనా స్థలాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో 72 ఏళ్ల ఆర్కే రబీ సింగ్ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. INA ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. మణిపూర్లో డ్రోన్లను ఆయుధాలుగా ఉపయోగించడం మొదటిసారిగా సెప్టెంబర్ 1న ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కోట్రుక్ గ్రామంలో కనిపించింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!