సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి నటించబోతుండటం విశేషం. వీరిద్దరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాంటిది మణిరత్నం మార్క్ మేకింగ్లో వీరు కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే..
Also Read : Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 14 నుండి ప్రారంభం కానుంది. దానికి ముందుగా ఈ నెలాఖరులోనే ఒక పవర్ఫుల్ ప్రోమో షూట్ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రాక్స్టార్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబో అంటేనే అదొక మ్యూజికల్ వండర్. అలాంటిది సాయి పల్లవి, విజయ్ సేతుపతి లాంటి పర్ఫార్మర్స్ తోడవ్వడంతో ఈ సినిమా ఇండియన్ లెవల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా మారనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
