Manda Krishna Madiga : మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలు చెపుతున్నాయని, మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నాడన్నారు మంద కృష్ణ. అధికారం లోకి వస్తె బీసీ నీ సీఎం చేస్తా అని ప్రకటించిన దమ్మున్న లీడర్ మోడీ అని, మాదిగల కు అండగా ఉంటానని నాలుగు రోజుల్లోనే మళ్ళీ వచ్చారన్నారు. ఏ ప్రధాని రాలేదని, దళితున్ని ప్రెసిడెంట్ చేశారు… అడవి బిడ్డను రాష్ట్రపతి చేశారన్నారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ లో ఇవి సాధ్యం కాలేదు… వాళ్లు ఎందుకు చేయలేదు.. కేసీఆర్ దీక్ష ను విరమింప చేసిన వారిలో నేను ఉన్నాను… కానీ అయన మంత్రి వర్గం లో ఒక్క మాదిగ మంత్రి లేరు. వెలమ లు నలుగురు… రెడ్డీ లు 7 గురు ఉన్నారు మంత్రి వర్గం లో… నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్… మనకు రాజకీయాలు కాదు.. మన భవిష్యత్ ముఖ్యం మంద కృష్ణ. కేసీఆఆర్ మాదిగలను అణచి వేశాడు… మోడీ మాదిగలను పైకి తీసుకెళ్లారు… తమిళనాడు లో మురుగన్ ఓడిన ఆయనకు రాజ్య సభ ఇచ్చి కేంద్ర మంత్రి చేశారు. కాంగ్రెస్ మహిళ రిజర్వేషన్ ల పై ఊరించింది… మోడీ 48 గంటల్లో మహిళ రిజర్వేషన్ చట్టం చేశారు. సామాజిక న్యాయం గురుంచి కథలు చెప్పేది కాంగ్రెస్, బీఆర్ఎస్. న్యాయం చేసేది మోడీ. 30 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్ ల గురించి ఉద్యమం చేసాము. కాంగ్రెస్ మాదిగ జాతిని మోసం చేసింది… మోడీ గారు మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి. పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ నినాదానికి న్యాయం చేయండి.. మోడీ మీ మనస్సు వెన్న పూస…. మీ గుండె గట్టిది…
Also Read
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
- RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే స్థాయికి వచ్చారు… దేశ ప్రధాని గారే మీ వేదిక మీదికి వస్తున్నారు అంటే మీ సమస్య పరిష్కారం అయినట్టే అని దేశ మేదావులు అన్నారు. మాట మీద నిలబడే నాయకుడు మీరు. దక్షిణాది మాదిగ లు బీజేపీ కి మద్దతు గా ఉంటారు’ అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే.. మంద కృష్ణ మాదిగ స్పీచ్ ను మోడీ కి ఎంపీ లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతున్నప్పుడు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ కి అండగా ఉంటామని మంద కష్ణమాదిగ కార్యకర్తలతో అనిపించారు.
తాజావార్తలు
-
Jagapathi Babu: ఎడిటింగ్లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!