Uttar Pradesh: గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు మద్యం మత్తులో ఉన్నందున.. ఈ విషయాన్ని గుర్తించలేదు. తర్వాత దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవ్వడం వల్ల జరిగిన అవమానాన్ని బాధితుడు తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో జులై 11న ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Rajasthan: 19 ఏళ్ల యువతి కిడ్నాప్, యాసిడ్ దాడి.. చివరకు మృతదేహాన్ని బావిలో పడేసి..
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
అసలేం జరిగిందంటే.. సోన్భద్ర జిల్లా జుగైల్ ప్రాంతానికి జవహర్ పటేల్, గులాబ్ కోర్లకు ఇంతకు ముందే పరిచయం ఉంది. వారిద్దరు కలిసి జులై 11న మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో జవహర్ పటేల్.. గులాబ్ కోర్ చెవిలో మూత్ర విసర్జన చేశాడు. బాధితుడు మద్యం మత్తులో ఉండడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరుసటి రోజు తనకు జరిగిన అవమానం గులాబ్ కోర్కు అర్థం అయింది. దీంతో గులాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో చిత్రీకరించారని, అది సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై గులాబ్ కోర్ ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ట్రెండింగ్ అంశాలు
మధ్యప్రదేశ్లో గిరిజన వర్గానికి చెందిన దశమత్ రావత్పై మూత్ర విసర్జన చేశారనే ఆరోపణపై ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో అధికార బీజేపీకి ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగిలి, ఆ తర్వాత ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ రావత్ పాదాలు కడిగారు.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!