Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Stabs Daughter: గుజరాత్లోని సూరత్లో దారుణం జరిగింది. కనిపెంచిన కన్నతండ్రే కన్నకూతురి పాలిట కాలయముడయ్యాడు. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్యచేశాడు. ఇంట్లో తగాదాల కారణంగా తన కుమార్తెను కత్తితో 25 సార్లు పొడిచి చంపి, అతని భార్యను గాయపరిచినందుకు సూరత్కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మే 18వ తేదీ రాత్రి సూరత్లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామానుజ అనే దుండగుడు తన కుటుంబంతో కలిసి సూరత్లోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తమ కుమార్తె టెర్రస్పై పడుకున్న విషయంపై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరిస్థితి తీవ్రమై హింసకు దారితీసింది. సుమారు రాత్రి 11.20 గంటలకు, రామానుజు మొదట తన పిల్లల ముందే తన భార్యపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న పిల్లలు అడ్డుకోబోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన రామానుజ.. కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..
తన కుమార్తెపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత కూడా, రామానుజు తన భార్యకు హాని చేయాలని నిశ్చయించుకుని డాబాపైకి ఎక్కాడు. తమ తల్లిని రక్షించడానికి సాహసోపేతమైన ప్రయత్నంలో, పిల్లలు జోక్యం చేసుకోగా.. రామానుజ దాడికి కూతురు బలి అయింది. దీంతో సూరత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు వేగంగా రామానుజను పట్టుకున్నారు. హత్యాయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్య, హత్యాయత్నం సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఆర్కే పటేల్ తెలిపారు.విచారణ కొనసాగుతుండగా, అధికారులు బాధితురాలు, ఫిర్యాదుదారు రేఖ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గాయపడిన వారు మరోవైపు చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!