NTV Telugu Site icon

Mumbai: నాకెందుకు అన్యాయం చేశావ్.. ప్రియురాలిని రాడ్తో కొట్టి చంపిన ప్రియుడు

Mumabi Murder

Mumabi Murder

ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. హత్యకు సంబంధించిన లైవ్ సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. అయితే.. మహిళపై దాడి చేస్తుండగా చాలా మంది ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ ఆపడానికి సాహసించలేదు.. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీశాడు.

Read Also: West Bengal: పశ్చిమ బెంగాల్ రాయకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమతా బెనర్జీ

కాగా.. బాధిత మహిళ ఆర్తి యాదవ్ (20)గా గుర్తించారు. అయితే.. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు.. రోహిత్ యాదవ్, మృతురాలు ఆర్తి యాదవ్.. కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని విడిపోయారు. ఈ క్రమంలో.. బాధిత మహిళ వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందని.. దీంతో కోపంతో హత్య చేసినట్లుగా నిందితుడు చెప్పాడు. కాగా.. ఈ ఘటనపై వలీవ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Swati Maliwal: నన్ను అవమానించారు.. ఇండియా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ