NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో పోలీస్ వాహనం ఢీకొని ఒకరి మృతి.. కానిస్టేబుల్ అరెస్ట్

Dee

Dee

దేశ రాజధానిలో ఢిల్లీలో పోలీస్ వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి: PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది

సోమవారం సరోజినీ నగర్ ప్రాంతంలో కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా పోలీస్ వాహనాన్ని నడిపాడు. దీంతో 58 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసు వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే అతడు మృతిచెందాడు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్‌లో తెల్లవారుజామున 3.27 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. ఢిల్లీ పోలీసు వాహనం ప్రమాదానికి గురైందని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని మాకు సమాచారం అందిందని మీనా తెలిపారు. భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలోకి పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ దెబ్బతిన్న స్థితిలో ఢిల్లీ పోలీసు వాహనాన్ని గుర్తించారు. ప్రమాదంలో బైజ్‌నాథ్‌ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించారు. రాజిందర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్ కానిస్టేబుల్ పర్దీప్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు ప్రారంభించామని, బైజ్‌నాథ్ త్రిలోక్‌పురి నివాసి అని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Sitara Ghattamaneni: మాస్ స్టెప్పులతో అదరకొట్టిన మహేష్ గారాల పట్టి..