Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: మెయింటెనెన్స్, సాంకేతిక లోపం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. మెహదీపట్నం విజయనగర్ కాలనీ మల్లేపల్లి HDFC ఏటీఎం సెంటర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్లో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళి మృతి చెందాడు. లోపలికి వెళ్లిన అనంతరం అనుకోని విధంగా ఏటీఎం సెంటర్ డోర్ లాక్ అయ్యింది. వ్యక్తి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఊపిరి ఆడక ఏటీఎం సెంటర్లోనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మెహదీపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ యాజమాన్యం సరైన మెయింటెనెన్స్ నిర్వహించిందా? డోర్ లాక్ అవ్వడానికి గల సాంకేతిక కారణాలేంటి? అనే కోణంలో పోలీస్ విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వ్యక్తి ఏటీఎంలోకి వెళ్ళిన తర్వాత తలుపు లాక్ అవ్వడం వల్ల, లోపల గాలి ఆడక (suffocation) మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఆ వ్యక్తి ఈ నెల 23న ఉదయం 5:30 గంటలకు ఏటీఎం లోపలికి వెళ్లాడు. సుమారు 6:30 వరకు లోపలే ఉన్నట్లు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యింది. మృతదేహంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!