Chennai: 28 ఏళ్ల క్రితం హత్య.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 1994లో చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్ కంపెనీ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న పట్టాజోషి.. మరో కంపెనీలో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న 21 ఏళ్ల ఇందిరతో ప్రేమలో పడ్డాడు. అనంతరం జూలై 1994లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Read Also: Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్
Also Read
- ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
కాగా.. 1995 ఆగస్టు 9న చెన్నైలోని నంగనల్లూర్ నివాసంలో పట్టజోషి తన భార్య, బావ కార్తీక్, అత్త రమ(48)పై కత్తితో దాడి చేశాడు. దాడిలో రమడు మృతి చెందగా, అతని భార్య, బావ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆదంబాక్కం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. దీంతో పట్టజోషి చెన్నైకి పారిపోయాడు. అనంతరం.. ఒడిశా, సూరత్లోని వివిధ ప్రదేశాలలో తలదాచుకున్నాడు. మొదట నిందితుడు అస్కాలోని స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు. అక్కడ అతను మరొక మహిళను కలుసుకుని.. 2001 లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి.. బెర్హంపూర్లోని ఒక సుగంధ ద్రవ్యాల కర్మాగారంలో, తర్వాత కేంద్రపరాలోని బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్మెన్గా, బెర్హంపూర్లోని చెకింగ్ ఫండ్ కంపెనీకి మేనేజర్గా పనిచేశాడు. అయితే.. గత 28 సంవత్సరాలుగా పోలీసు బృందాలు బెర్హంపూర్ మరియు సమీప ప్రాంతాలలో దాడులు నిర్వహించినప్పటికీ.. నిందితుడు ఇల్లు, ఉద్యోగం మారడం వల్ల అతన్ని అరెస్టు చేయలేకపోయారు.
Read Also: MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
అయితే.. వారం రోజుల క్రితం చెన్నైలోని ఆదంబాక్కం పోలీస్ స్టేషన్కు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పోలీసు బృందం బెర్హంపూర్ పోలీసులను ఆశ్రయించింది. గోసానినుగావ్ ఇన్స్పెక్టర్ స్మృతి నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సమన్వయంతో పనిచేసి అన్ని అనుమానాస్పద ప్రదేశాలలో నిఘా ఉంచి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!