Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives- India Tension: చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్ను సందర్శించనున్నారు. జమీర్ పర్యటన షెడ్యూల్ ను మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత ఊపందుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ద్వీప దేశంలో మూడు సైనిక స్థావరాలను నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ పట్టుబట్టడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. భారత్ ఇప్పటికే చాలా మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ప్రెసిడెంట్ ముయిజ్జూ తన దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవడానికి మే 10ని గడువుగా నిర్ణయించారు.
Read Also: Kajal Agarwal : మరోసారి బాలయ్య సినిమాలో కాజల్..?
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు (మే 9) అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం నాడు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో జమీర్ భేటీ అవుతారని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశంగా ఉంది.
Read Also: PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ
అలాగే, విదేశాంగ మంత్రి జమీర్ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊపందుకుంటుంది అని MEA ఒక ప్రకటనలో పేర్కొంది. మాల్దీవులు-భారత్ భాగస్వామ్యాన్ని “దీర్ఘకాలిక” సంబంధాలను విస్తరించడంపై దృష్టి సారించి జైశంకర్తో జమీర్ చర్చలు జరుపుతారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమీర్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!