Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?
Maldives- India Tension: చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్ను సందర్శించనున్నారు. జమీర్ పర్యటన షెడ్యూల్ ను మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత ఊపందుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ద్వీప దేశంలో మూడు సైనిక స్థావరాలను నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ పట్టుబట్టడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. భారత్ ఇప్పటికే చాలా మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ప్రెసిడెంట్ ముయిజ్జూ తన దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవడానికి మే 10ని గడువుగా నిర్ణయించారు.
Read Also: Kajal Agarwal : మరోసారి బాలయ్య సినిమాలో కాజల్..?
Also Read
ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు (మే 9) అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం నాడు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో జమీర్ భేటీ అవుతారని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశంగా ఉంది.
Read Also: PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ
అలాగే, విదేశాంగ మంత్రి జమీర్ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊపందుకుంటుంది అని MEA ఒక ప్రకటనలో పేర్కొంది. మాల్దీవులు-భారత్ భాగస్వామ్యాన్ని “దీర్ఘకాలిక” సంబంధాలను విస్తరించడంపై దృష్టి సారించి జైశంకర్తో జమీర్ చర్చలు జరుపుతారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమీర్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!