Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives- India Tension: చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్ను సందర్శించనున్నారు. జమీర్ పర్యటన షెడ్యూల్ ను మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత ఊపందుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ద్వీప దేశంలో మూడు సైనిక స్థావరాలను నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ పట్టుబట్టడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. భారత్ ఇప్పటికే చాలా మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ప్రెసిడెంట్ ముయిజ్జూ తన దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవడానికి మే 10ని గడువుగా నిర్ణయించారు.
Read Also: Kajal Agarwal : మరోసారి బాలయ్య సినిమాలో కాజల్..?
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు (మే 9) అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం నాడు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో జమీర్ భేటీ అవుతారని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశంగా ఉంది.
Read Also: PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ
అలాగే, విదేశాంగ మంత్రి జమీర్ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊపందుకుంటుంది అని MEA ఒక ప్రకటనలో పేర్కొంది. మాల్దీవులు-భారత్ భాగస్వామ్యాన్ని “దీర్ఘకాలిక” సంబంధాలను విస్తరించడంపై దృష్టి సారించి జైశంకర్తో జమీర్ చర్చలు జరుపుతారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమీర్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!