India Maldives Tension: తొలిసారి భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి వచ్చేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్తో దౌత్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాల్దీవుల విదేశాంగ మంత్రి ఇక్కడ పర్యటించేందుకు రాబోతున్నట్లు సమాచారం. రెండు దేశాల మధ్య పర్యటన తేదీని నిర్ణయించనప్పటికీ, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే మొదటి లేదా రెండవ వారంలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.దీంతో చైనాకు అనుకూలంగా ఉన్న మాల్దీవుల ప్రభుత్వం భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మూసాపర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Read Also: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
కాగా, గత కొన్ని నెలలుగా భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు గందరగోళంగా ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందడానికి ముందు మహ్మద్ ముయిజ్జూ భారత దళాల ఉపసంహరణ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయిజ్జూ భారత సైనికులను మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు మే 10 వరకు పరిమితి విధించారు. వాస్తవానికి, భారతీయ హెలికాప్టర్ల ఆపరేషన్, నిర్వహణ కోసం మాల్దీవులలో భారతీయ సైనికులు మోహరించారు. ఇప్పుడు సైనికుల స్థానంలో భారతీయ ఇంజనీర్లు వచ్చారు.
Read Also: Allari Naresh : ఆ సినిమాతో మళ్ళీ సొంత గ్రౌండ్ లో ఆడుతున్నట్లు వుంది..
ఇక, మాల్దీవులలో గత కొన్ని దశాబ్దాలుగా, కొత్త ప్రెసిడెంట్ మొదట భారతదేశాన్ని సందర్శించేవారు, అయితే, ముయిజ్జూ మాత్రం ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి.. చైనాను సందర్శించాడు. ముయిజ్జు భారత్తో రక్షణ, భద్రతా సహకారాన్ని పరిమితం చేయాలనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా బంపర్ విజయం సాధించిన తర్వాత.. ముయిజ్జూ బలం మరింత బలపడింది. ఇక, భారత్తో దౌత్యపరమైన సహకారం కోసం మాల్దీవులు ఈ నెలలో భారత్ను సందర్శించే ఛాన్స్ ఉంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్కు రావడం ముయిజ్జూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది మొదటి అధికారిక పర్యటన అవుతుంది. భారతదేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతుంది. జమీర్ పర్యటన మే 10 గడువులోగా జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!