Maldives: భారతదేశంపై మహ్మద్ ముయిజ్జూవన్నీ అబద్ధాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives-India: మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ తోసిపుచ్చారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని వెల్లడించారు. ఎన్నికల టైంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే ముయిజ్జూ ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాడని ఆయన పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారు.. అందులో ఇదొకటని ఆయన తెలిపారు.
Read Also: Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
కాగా, గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు మాల్దీవుల్లోకి ప్రవేశించారని ఎలక్షన్ టైంలో మహ్మద్ ముయిజ్జూ ప్రచారం చేశారని అబ్దుల్లా షాహిద్ ఆరోపించారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేశారని ఎండీపీ పార్టీ తెలిపింది. కానీ, భారత్ తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక ముయిజ్జూ నిరూపించలేకపోతున్నారని అబ్దుల్లా షాహిద్ చెప్పారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే ఆయన పదే పదే అనేక అబద్ధాలు చెప్తున్నారని వెల్లడించారు.
Read Also: Medaram Jathara: నేడు మేడారం నుంచి 512 హుండీలు తరలింపు.. 29 నుంచి లెక్కింపు..
ఇక, చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్- మాల్దీవుల మధ్య గ్యాప్ పెరిగింది. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10 లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి భారత్ కు తిరిగి వెళ్లిపోవాలని ముయిజ్జూ పేర్కొన్నారు. భారత్కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం విధులు నిర్వహిస్తుంది. భారతదేశ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను ఈ సైన్యం చూస్తోంది.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!