Maldives: భారతదేశంపై మహ్మద్ ముయిజ్జూవన్నీ అబద్ధాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives-India: మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ తోసిపుచ్చారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని వెల్లడించారు. ఎన్నికల టైంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే ముయిజ్జూ ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాడని ఆయన పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారు.. అందులో ఇదొకటని ఆయన తెలిపారు.
Read Also: Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
కాగా, గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు మాల్దీవుల్లోకి ప్రవేశించారని ఎలక్షన్ టైంలో మహ్మద్ ముయిజ్జూ ప్రచారం చేశారని అబ్దుల్లా షాహిద్ ఆరోపించారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేశారని ఎండీపీ పార్టీ తెలిపింది. కానీ, భారత్ తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక ముయిజ్జూ నిరూపించలేకపోతున్నారని అబ్దుల్లా షాహిద్ చెప్పారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే ఆయన పదే పదే అనేక అబద్ధాలు చెప్తున్నారని వెల్లడించారు.
Read Also: Medaram Jathara: నేడు మేడారం నుంచి 512 హుండీలు తరలింపు.. 29 నుంచి లెక్కింపు..
ఇక, చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్- మాల్దీవుల మధ్య గ్యాప్ పెరిగింది. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10 లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి భారత్ కు తిరిగి వెళ్లిపోవాలని ముయిజ్జూ పేర్కొన్నారు. భారత్కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం విధులు నిర్వహిస్తుంది. భారతదేశ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను ఈ సైన్యం చూస్తోంది.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!