Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలేషియా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే పెట్రోల్ రాయితీ ఖర్చుల్లో ప్రభుత్వానికి 7,309,084 రింగిట్లు (సుమారు రూ. 14 కోట్లకు పైగా) ఆదా అయ్యాయని మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘తన్ శ్రీ షంషుల్ అజ్రీ అబు బకర్’ వెల్లడించారు. ఈ మూడు నెలల కాలంలో ఏకంగా 40,46,448 లీటర్ల ఇంధన వినియోగం తగ్గడం విశేషం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 6.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందారు.
‘హైబ్రిడ్ వర్కింగ్ డే’ విధానం..
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, ప్రభుత్వం ఆగస్టు 1 నుండి సరికొత్త ‘హైబ్రిడ్ వర్కింగ్ డే’ (HWD) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇంధన రాయితీ ఖర్చులను అదుపులో ఉంచుతూనే, పని ఉత్పాదకతను నిలబెట్టుకోవడం. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులు కార్యాలయం (ఆఫీస్) నుండి పని చేయాలి. మిగిలిన 2 రోజులు ఇంటి నుండి (WFH) లేదా ప్రత్యామ్నాయ ప్రాంతాల నుండి విధులు నిర్వర్తించవచ్చు.
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
- Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
పొడిగించిన సెలవులకు చెక్..
ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. వారాంతపు సెలవులు (Saturdays అండ్ Sundays) లేదా పండుగ సెలవులకు ముందురోజు, ఆ తర్వాత రోజుల్లో హైబ్రిడ్ వర్కింగ్ ఆప్షన్ ఎంచుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి శని, ఆదివారాలు సెలవు ఉంటే.. వారు సోమవారం లేదా శుక్రవారం రోజుల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి అనుమతి ఉండదు. దీనివల్ల ఉద్యోగులు వరుసగా లాంగ్ వీకెండ్స్ (సుదీర్ఘ సెలవులు) ప్లాన్ చేసుకోకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, వ్యయ నియంత్రణతో పాటు సులభతర పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?