Malaria Outbreak: మన్యంలో మలేరియా.. ఆందోళన చెందుతున్న గిరిజనులు!
- మన్యం జిల్లా ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు
- జ్వరాలతో బాధపతున్న 25 మంది
- 10 మందికి మలేరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaria Scare in Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధిలోని తాడివలస, జీలకవలస గ్రామాల్లో ఇప్పటివరకు సుమారు 25 మంది వరకు జ్వరాలతో బాధపతున్నారు. వీరిలో 10 మందికి మలేరియాగా చెబుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న 15 మంది ప్రస్తుతం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 10 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.
జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వారం రోజుల క్రితం గురునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. అయినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల్లో కలుషిత నీరు, గెడ్డ నీటిని తాగడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో బోర్లు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సింగిల్ ఫేజ్గా ఉండటంతో మోటార్లు పనిచేయడం లేదు. దీంతో స్వచ్ఛమైన తాగునీటి కొరత ఏర్పడిందని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు వైద్య సేవలను మరింత విస్తరించాలని కోరుతున్నారు.
Also Read
- Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!