Doda Bus Accident: జమ్ము కశ్మీర్లో కాలువలో పడిన బస్సు.. 30 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doda Bus Accident: జమ్మూకశ్మీర్లోని దోడాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్త్వార్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు అస్సార్ ప్రాంతంలో కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ కిష్త్వార్, దోడాలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన వారి కోసం త్వరలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నారు. అయితే ప్రమాద తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో బస్సు కాలువలో పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. స్థానిక యంత్రాంగం సహకారంతో ప్రజలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం గుండా రోడ్డు వెళ్లడం, మలుపు వద్ద లోతైన గుంత ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మలుపు తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పి ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
#WATCH | At least five people died in a bus accident in Assar region of Doda in J&K. Injured shifted to District Hospital Kishtwar and GMC Doda. Details awaited. pic.twitter.com/vp9utfgCBR
— ANI (@ANI) November 15, 2023
ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. అసర్లో జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని అన్నారు. క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!