Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Major Banking Rule Changes From April 1 Updates On Atm Withdrawals Minimum Balance Credit Cards And More

New Banking Rules: అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు! ముఖ్యమైన మార్పులు ఏంటంటే?

Published Date :March 25, 2025 , 6:18 pm
By Kothuru Ram Kumar
  • ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు
  • కొత్త ఆర్థిక ఏడాది మొదలు నేపథ్యంలో పలు మార్పులు.
  • ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు, పరిమితులు.. మినిమమ్ బ్యాలెన్స్ లలో మార్పులు.
New Banking Rules: అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు! ముఖ్యమైన మార్పులు ఏంటంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

New Banking Rules: ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు చాలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. ప్రతి కొత్త ఆర్థిక ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని రూల్స్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులను ప్రకటించాయి. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, కానరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు తమ బ్యాంకింగ్ విధానాలను మరింత పారదర్శకంగా మార్చడం, కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.

Read Also: 5G Smartphones: కేవలం పదివేలలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్..

ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు, పరిమితులు:
ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలను కొన్ని బ్యాంకులు మార్చినట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుండి ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గించబడింది. కస్టమర్లు ప్రత్యేకంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేయగలరు. ఆ తర్వాత ప్రతి అదనపు విత్‌డ్రాయల్‌కు రూ. 17లు ఛార్జీ విధించనున్నారు.

మినిమమ్ బ్యాలెన్స్:
ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కానరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను మార్చనున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుండి గ్రామీణ, పట్టణ, నగరాల కోసం ప్రత్యేకమైన మినిమమ్ బ్యాలెన్స్ నియమాలను అమలు చేయనున్నారు. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్‌ను నిలుపుకోలేకపోతే జరిమానాకు గురవుతారు. అంతేకాదు, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను కూడా బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయించనున్నట్లు సమాచారం.

క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు:
ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్పులను చేసాయి. క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కోసం ఇప్పటివరకు అందిస్తున్న టికెట్ వౌచర్ సౌకర్యాన్ని ఇకపై రద్దు చేయనున్నారు.

Read Also: Health Tips: ఉక్కు లాంటి కండరాల కోసం ఈ కూరగాయలు బెస్ట్.. గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్!

డిజిటల్ బ్యాంకింగ్ పై దృష్టి:
బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, AI చాట్‌బాక్స్‌లు ప్రవేశపెట్టడం, డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచడం వంటి చర్యలను చేపట్టాయి. ఇందులో ముఖ్యంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication) ను మరింత పటిష్టంగా చేస్తూ వినియోగదారుల లావాదేవీల భద్రతను పెంచనున్నారు.

పాజిటివ్ పే సిస్టమ్:
వ్యాపార లావాదేవీలు మరింత సురక్షితంగా, పారదర్శకంగా ఉండేందుకు కొన్ని బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (Positive Pay System) ను ప్రవేశపెట్టాయి. ఈ కొత్త విధానం ప్రకారం రూ. 5000 పైగా చెల్లింపుల కోసం చెక్ ఇచ్చే కస్టమర్లు ముందుగా తమ చెక్ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ విధానం మోసాలను నివారించడానికి ఉపయోగపడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • April 2025 banking changes
  • ATM WITHDRAWAL CHARGES
  • Banking Rules
  • digital banking
  • financial updates

తాజావార్తలు

  • Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రలో కలకలం.. తేనెటీగల దాడితో గందరగోళం.!

  • Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..! బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి..?

  • SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..

  • Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

  • PAK vs BAN: మొన్నటి వరకు చెట్టాపట్టాల్, ఇప్పుడు మాటల యుద్ధాలు.. ఒక్క ‘‘రనౌట్’’ పరిస్థితిని మార్చింది..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions