Mahmood Ali : దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు చేయలేదని రాష్ట్రం హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు సేవా పతకాల ప్రదానం 281 మంది పోలీస్ అధికారులకు బుధవారం నాడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ పతకాల పంపిణి కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం పురోభివృద్ధిలో పయనిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణ, పెద్ద ఎత్తున నియామకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఇటీవల ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ లాంటి భవనం మరెక్కడా లేదని ప్రస్తావించారు.
Also Read : Martin Scorsese: మార్టిన్ స్కార్ససే… ఎందుకంత సేపు!
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
కొత్త పోలీస్ జోన్లు ఏర్పాటు చేయడం, పోలీస్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటుతోపాటు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం, ఐ 4 సి లను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ టవర్ ను కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన శాంతియుత పరిస్థితులు ఉన్నందునే, అనేక బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ లో ప్రారంభించాయని అన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్, మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్ , భరోసా కేంద్రాలు, సీసీ టీవీ ల ఏర్పాటు, మట్కా-గ్యాంబ్లిగ్ కేంద్రాల మూసివేత, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణా పోలీస్ దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా నిలిచిందని హోం మంత్రి తెలియచేసారు.
Also Read : HD Kumaraswamy: “కింగ్ మేకర్” కాదు.. “కింగ్”గా మారబోతున్నాం..
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఈ పతకాలు కేవలం వ్యక్తిగతం కావని, తమ పరిధిలో పనిచే వారందరితోపాటు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా బావించాలన్నారు. పోలీస్ శాఖ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఒక ప్రధాన భాగమని అన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని అన్నారు. నిరంతరం 24/7 ప్రజా సేవలో విధులు నిర్వర్తించే పోలీసులు తాము అందించే ఉత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలను అంద చేయడం జరుగుతుందని, ఈ పతకాల స్పూర్తితో మరింత అంకిత భావంతో పనిచేయాలని పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని అన్నారు.
అడిషనల్ డీజీ. అభిలాష బిస్త్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలకగా, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఎసిబి డీజీ రవిగుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు విజయ కుమార్, షిఖా గోయల్, స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఐజి లు కమలహాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, రమేష్, లతోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు. మెడల్స్ గ్రహీతలను సైబరాబాద్ అడిషనల్ కమీషనర్ రితీ రాజ్ వేదికపై ఆహ్వానించారు
మెడల్స్ గ్రహీతలు….
2022 సంవత్సరానికి గాను అతి ఉత్క్రిష్ట్ సేవ పతకం స్వీకరించిన వారిలో డీజీపీ అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సి.వీ ఆనంద్, ఐ.జి. వి.బి కమలాసన్ రెడ్డి లతోపాటు 26 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఉత్క్రిష్ట్ సేవ పథకాలు -2022 కుగాను స్వీకరించిన వారిలో ఐజి తరుణ్ జోషి, సైబరాబాద్ జాయింట్ కమీషనర్, డీఐజీ అవినాష్ మొహంతి లతోపాటు 28 మంది పోలీస్ అధికారులున్నారు. 20-21 కి గాను అసాధారణ ఆసూచన కుశలత పతకం స్వీకరించిన వారిలో హైదరాబాద్ ఐజి వీ. శివ శంకర్ తదితరులున్నారు. హోం మంత్రి ప్రదానం చేసిన ఈ అవార్డులలో అతి ఉత్క్రిష్ట్ సేవ పథకాలు -2022 లను 30 మంది పోలీస్ అధికారులకు, ఉత్క్రిష్ట్ సేవ పథకాలు- 2022 కుగాను 28 మందికి, అసాధారణ ఆసూచన కుశలత పధకం లను 7 గురికి, ఇన్వెస్టిగేషన్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోమ్ మంత్రి మెడల్స్ 8 మందికి, ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోమ్ మంత్రి మెడల్స్ 11 మందికి, శౌర్య పధకం – 2022 లు 11 మందికి, మహోన్నత సేవ పథకం -2022 లు 7 గురు పోలీస్ అధికారులకు అందచేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!