NTV Telugu Site icon

Kotha Manohar Reddy: గడప గడపకు ప్రచారంలో దూసుకుపోతున్న మనోహర్‌ రెడ్డి

Kotha Manohar Reddy

Kotha Manohar Reddy

Kotha Manohar Reddy: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించారు. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి సార్లరావు పల్లి, సాయిరెడ్డి గూడ, ముచ్చర్ల, దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి, నేద్నుర్, మన్యే గూడ ప్రాంతాలలో పర్యటించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని.. కబ్జా ప్రభుత్వం అయిన బీఆర్‌ఎస్‌ను తొక్కుకుంటూ ఏనుగు అనూహ్యంగా దూసుకుపోతోందని మహేశ్వరం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్‌ రెడ్డి అన్నారు.

Also Read: Congress: బీజేపీకి అత్యంత విశ్వసనీయ నేత అసదుద్దీన్ ఓవైసీ.. “ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ” వ్యాఖ్యలపై కాంగ్రెస్

మహేశ్వరం నియోజక వర్గంలో నిరంతరాయంగా సాగుతున్న గడప గడప ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి దూసుకుపోతున్నారు. పల్లె బాట పట్టిన కొత్త మనోహర్ రెడ్డి ఒకవైపు తను చేసిన సేవ కార్యక్రమాలు.. మరొక వైపు అధికార ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి నిజమైన నాయకుడు రానున్నాడని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఇక, మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బీఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి కోరారు. పదవి లేకపోయినా నిరంతరం పేద ప్రజల మధ్య ఉంటూ కేఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా 3000 మంది నిరుపేదలకు 60 గజాల ఇంటిస్థలం అందజేశానని కొత్త మనోహర్ రెడ్డి వెల్లడించారు. తాను గెలిచిన వెంటనే మహేశ్వరం నియోజక వర్గంలోని నిరుపేదలను గుర్తించి వారికి కూడా 60 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తానని ఆయన పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జా చేసిన భూములన్నీ తిరిగి పేద ప్రజలకు పంచి పెడతానని హామీ ఇచ్చారు. ఎప్పుడు మీతోనే ఉండి.. ఆపద వచ్చినప్పుడు కూత వేటు దూరంలో ఉండే నాయకుడు కావాలా.. లేక ఎలక్షన్ లు రాగానే అధికార దాహంతో విచ్చల విడిగా డబ్బులు, మందు, పంచి మళ్లీ ఎన్నికల తర్వాత కనిపించకుండ పోయే నాన్ లోకల్ లీడర్లు కావాలా మీరే తేల్చుకోవాల అని కొత్త మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.