Maharashtra Shocker: బిల్డింగ్పై నుంచి ప్రియురాలిని తోసేసి హత్య..
- లవర్పై అనుమానం..
- బిల్డింగ్పై నుంచి తోసి ప్రియురాలి హత్య..
- మహారాష్ట్రలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Shocker: మహారాష్ట్ర నేవీ ముంబైలో యశశ్రీ హత్య ఘటన మరవకముందే, సతారాలో ప్రియుడి చేతిలో మరో యువతి హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని ఆమె ప్రియుడు బిల్డింగ్పై నుంచి తోసేసి హత్య చేశాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నిందితుడిని ధ్రువ్ చిక్కర్గా గుర్తించారు. మృతిచెందిన యువతి ఆరుషి మిశ్రాగా పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ కూడా కరాడ్లోని కృష్ణ మెడికల్ కాలేజీలో చదువుతున్నారు.
Read Also: MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా సోనిపట్కి చెందిన ధ్రువ్, బీహార్ ముజఫర్ నగర్క్ి చెందిన ఆరుషితో మూడేళ్ల పరిచయం ఉంది. వారిద్దరు సతారాకు వెళ్లే ముందు ఢిల్లీలో కలిసి చదువుకున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి ధృవ్, ఆరుషి మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించిన ధృవ్, ఆవేశంతో భవనం మూడో అంతస్తు నుంచి కిందికు తోసేశాడు. భవనం నుంచి పడి ఆరుషి మరణింది. ఘర్షణ సమయంలో ధ్రువ్ గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు నవీ ముంబైలో ఇదే తరహాలో 20 ఏళ్ల యశశ్రీ షిండే హత్యకు గురైంది. ఆమె ప్రియుడు దావూద్ షేక్ కత్తితో పొడిచి హత్య చేశాడు. గత కొంత కాలంగా దావూడ్, యశశ్రీని వేధిస్తున్నాడు. ఆమె ప్రైవేట్ ఫోటోని ఫేక్బుక్లో పోస్ట్ చేసి, దానిని తొలగించాలంటే తనని కలవాలని నవీ ముంబైకి రప్పించి హత్య చేశాడు.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!