Maharashtra: ఎన్నికల వేళ ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి మారాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళలకు పెద్ద పీటవేస్తూ సోమవారం మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డ్లు వంటి అన్ని ప్రభుత్వ పత్రాలపై తల్లి పేరు తప్పనిసరిగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని తీర్మానించింది.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంట గ్యాస్ ధరను రూ.100లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం బిల్లును అమల్లోకి తెచ్చింది. ఇలా ఆయా వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర సర్కార్.. ఎప్పుట్నుంచో పెండింగ్లో ఉన్న మరాఠా బిల్లును ప్రత్యేక శాసనసభ నిర్వహించి ఆమోదించింది. ఈ బిల్లుతో మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. తాజాగా నారీమణులకు పెద్ద పీట వేస్తూ అన్ని ప్రభుత్వ పత్రాల్లో పేరు ఉండేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. పైగా సోమవారం సీఏఏ బిల్లును కేంద్రం ఆమోదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నోటిఫికేషన్కు కౌంట్డౌన్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Maharashtra cabinet has decided that the name of the mother will be mandatory on all govt documents like Birth certificates, School documents, property documents, Aadhar cards, and PAN cards. The decision is to be implemented from 1st May 2024.
— ANI (@ANI) March 11, 2024
తాజావార్తలు
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!