Maharashtra: ఎన్నికల వేళ ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి మారాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళలకు పెద్ద పీటవేస్తూ సోమవారం మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డ్లు వంటి అన్ని ప్రభుత్వ పత్రాలపై తల్లి పేరు తప్పనిసరిగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని తీర్మానించింది.
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంట గ్యాస్ ధరను రూ.100లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం బిల్లును అమల్లోకి తెచ్చింది. ఇలా ఆయా వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర సర్కార్.. ఎప్పుట్నుంచో పెండింగ్లో ఉన్న మరాఠా బిల్లును ప్రత్యేక శాసనసభ నిర్వహించి ఆమోదించింది. ఈ బిల్లుతో మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. తాజాగా నారీమణులకు పెద్ద పీట వేస్తూ అన్ని ప్రభుత్వ పత్రాల్లో పేరు ఉండేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. పైగా సోమవారం సీఏఏ బిల్లును కేంద్రం ఆమోదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నోటిఫికేషన్కు కౌంట్డౌన్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Maharashtra cabinet has decided that the name of the mother will be mandatory on all govt documents like Birth certificates, School documents, property documents, Aadhar cards, and PAN cards. The decision is to be implemented from 1st May 2024.
— ANI (@ANI) March 11, 2024
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!