Mahakumbh : 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. సాధువు వేషంలో ప్రత్యేక్షం..
- నేడే మహా కుంభమేళా చివరి రోజు
- తప్పిపోయిన వారిని కలుసుకుంటున్న జనాలు
- 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కర్ణాటక వాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో ఈరోజు చివరి రోజు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా కారణంగా.. కుటుంబం నుంచి తప్పిపోయిన వాళ్లను సైతం కొంత మంది కలుసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని విజయపురానికి చెందిన రమేష్ చౌదరి. ఈయన 24 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా ద్వారా తన కుటుంబాన్ని తిరిగి కలిశాడు.
READ MORE: Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
విజయపురలోని కొల్హారా తాలూకాలోని బలుటి గ్రామానికి చెందిన రమేష్ చౌదరి 2001లో తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా ద్వారా కుటుంబీకుల చెంతకు చేరుకున్నాడు. 24 సంవత్సరాల క్రితం రమేష్ కనిపించకుండా పోయినపుడు.. అతని కోసం విస్తృతంగా వెతికారు. కానీ ఎలాంటి ఫలితం లభించలేదు. తాజాగా బలుటి గ్రామానికి చెందిన మల్లనగౌడ పాటిల్, ఇతరులు ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాకు వెళ్లారు. పుణ్యస్నానాలు పూర్తి చేసుకుని.. కాశీకి బయలుదేరారు. అక్కడ వారికి రమేష్ కనిపించాడు. కాశీలో ఒక సాధువు వేషంలో రమేష్ను దర్శనమిచ్చాడు. కుటుంబీకులతో వీడియో కాల్లో మాట్లాడి.. బలుటి గ్రామానికి తిరిగి తీసుకెళ్లాడు.
READ MORE: Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. “నేను ఇంటి నుంచి తప్పిపోయి అనేక నగరాలు తిరిగాను. తరువాత నేను బీహార్లోని పాట్నా చేరుకున్నాను. అక్కడ తారు రోడ్డు వేసే పనులు చేశాను. నా ఇళ్ల నాకు చాలా గుర్తుకు వచ్చింది. నేను రెండు సార్లు ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ విరమించుకున్నాను. ఇక్కడికి వచ్చిన మల్లన గౌడ నా కొడుకు, తల్లిదండ్రులు, కుటుంబం గురించి చెప్పాడు. ఇప్పుడు నేను నా కుటుంబం వద్దకు వెళ్లాలను కుంటున్నాను.” అని తెలిపాడు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!