Mahadev : దుబాయ్ పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ స్కామ్ నిందితుడు రవి ఉప్పల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahadev : మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్ద విజయం సాధించింది. మంగళవారం నాడు ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ను దుబాయ్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే అతడిని భారత్కు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప్పల్ యాప్ సహ వ్యవస్థాపకుడు కూడా. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. దీని తరువాత దుబాయ్ పోలీసులు 43 ఏళ్ల ఉప్పల్ను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉప్పల్ను ఈడీ విచారిస్తోంది. ఇది కాకుండా, ఛత్తీస్గఢ్ పోలీసులు, ముంబై పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో ఉప్పల్తో పాటు మరో ప్రమోటర్పై దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీని తర్వాత, రెడ్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ను ఇడి అభ్యర్థించింది. ఉప్పల్ తన భారత పౌరసత్వాన్ని వదులుకోకుండా వనౌటు పాస్పోర్ట్ తీసుకున్నారని చార్జ్ షీట్లో ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. వనాటు ఒక ఖండాంతర దేశం.
Read Also:CM YS Jagan: సీఎం జగన్ వరుస సమీక్షలు.. సాయంత్రం తిరుపతికి ఏపీ సీఎం
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
త్వరలో మరో అరెస్ట్
అక్రమ బెట్టింగ్లో ప్రమేయం ఉన్న మరో ప్రమోటర్, సూత్రధారి సౌరభ్ చంద్రకర్ను కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని తరువాత అతన్ని భారతదేశానికి తీసుకురావచ్చు. ప్రస్తుతం ఆయన యూఏఈలో ఉన్నారు. ఉప్పల్తో పాటు చంద్రకర్పై కూడా అక్టోబర్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. విశేషమేమిటంటే వారిద్దరిపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పొందింది.
Read Also:Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
ఉప్పల్పై చర్యలు ముఖ్యం
మహదేవ్ యాప్ కేసులో ఉప్పల్ అరెస్టును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలకు ప్రమోటర్లు రూ.500 కోట్లు లంచం ఇచ్చారని నిందితుల్లో ఒకరు ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన రూ. 5 కోట్ల నగదుతో కొరియర్ అసీమ్ దాస్ను ఇడి అరెస్టు చేసింది. చంద్రకర్, ఉప్పల్ తరపున నగదు పంపినట్లు కొరియర్ అంగీకరించినట్లు ఏజెన్సీ పేర్కొంది.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!