Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళాకు ఎలా వెళ్ళాలి..? పుణ్యస్నానాల ముఖ్య తేదీలు…
- మహాకుంభ మేళాకు ఎలా వెళ్ళాలి..?
- ఏ తేదీల్లో పుణ్యస్నానాల చేయాలి..?
- ఎక్కడ బస చేయాలి.?
- పూర్తి వివరాలు వీడియోలో
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది, ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరుగుతోంది. ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమంలో చేరి గంగామాతకు మనసారా పూజలు చేస్తున్నారు. ఈ వేడుక జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకు దాదాపు నలభై అయిదు రోజులపాటు కొనసాగుతుంది.
పండితుల ప్రకారం, కుంభమేళా పుణ్యస్నానాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం, గంగమ్మతల్లిని ఆచారమయిన విధంగా పూజించడం అత్యంత పరమార్థంగా ఉంటుంది. ఈ వేడుక, క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత భాండం కథతో సంబంధం కలిగి ఉంటుంది. దేవతలు, రాక్షసుల మధ్య అమృతం కోసం జరిగే పోరాటంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై నాలుగు ప్రధాన నదుల్లో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఈ నాలుగు నదులు, గంగ, శిప్రా, గోదావరి, , త్రివేణి సంగమం (ప్రయాగ్రాజ్) అత్యంత పవిత్రతను సంపాదించుకున్నాయని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. ఈ నదుల నీళ్లు కొన్ని సమయాలలో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని భావిస్తారు, కుంభమేళా సమయం నడుమ కోట్లాది భక్తులు ఈ నదుల్లో స్నానం చేస్తారు.
కుంభమేళా సమయాన్ని నిర్ణయించడానికి ఆకాశంలోని గ్రహాల కదలికలను, ముఖ్యంగా బృహస్పతీ, సూర్యచంద్రుల గమనాలను ఆధారంగా తీసుకుంటారు. కుంభమేళా రెండు రకాలుగా జరుపుతారు: అర్ధ కుంభమేళా (ఒకటి ఆరేళ్లలో ఒకసారి) , మహాకుంభమేళా (పన్నెండు సంవత్సరాల్లో ఒకసారి). మహాకుంభమేళాను, బృహస్పతీ యొక్క కదలికలు, 12 సంవత్సరాల రాశి చక్రాన్ని పూర్తి చేయడమే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్నది మహా కుంభమేళానే. మహా కుంభమేళా ఈసారి దేవతల గురువు బృహస్పతీ వారి కదలికల ఆధారంగా నిర్ణయించబడింది.
ఈ సారి ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు విశేష సంఖ్యలో తరలివచ్చారు..అఖాడాలు, సాధుసంతులు. మేళాలో పాలుపంచుకుంటున్న వివిధ అఖాడాల సంస్థల ప్రతినిధులు..సాధువుల కూటములు ఈనెల 27న సనాతన్ బోర్డు రాజ్యాంగ ముసాయిదాను విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపాయి. మేళాలోని నిరంజని అఖాడాలో పలువురు సాధువుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షులు, మానసాదేవి మందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు అయిన శ్రీ మహంత్ రవీంద్రపురీజీ మహారాజ్ మాట్లాడుతూ…నిత్యం సనాతన ధర్మం కోసమే పాడుపడుతున్న అఖాడాలు..సనాతనధర్మానికి సంబంధించి ప్రత్యేకంగా యోగ్యులైన వారితో బోర్డు ఏర్పాటు చేయాలని అన్ని అఖాడాలు కోరుతున్నాయన్నారు. అయితే.. ఈ మహాకుంభ మేళాకు ఎలా వెళ్ళాలి..? ఏ తేదీల్లో పుణ్యస్నానాల చేయాలి..? ఎక్కడ బస చేయాలి.? పూర్తి వివరాలు వీడియోలో చూడండి..
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!