Madhyapradesh : దారుణం.. రైళ్లో మహిళపై అత్యాచారయత్నం.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల దాడులు రోజూ రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాల ను తీసుకొని వస్తున్నా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కదులుతున్న రైళ్లో మహిళ పై అత్యాచారం చెయ్యడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించగా ఆమె ప్రతి ఘటించడంతో ఆ దుర్మార్గులు రైళ్లో నుంచి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దారుణం చోటుచేసుకుంది. కదులుతోన్న రైల్లో ఓ మహిళ పై ఐదుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటమే గాకుండా.. ఆమె బంధువు ను బలవంతంగా బయటకు తోసేశారు. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన వారిద్దరిని స్థానిక గ్రామస్థులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ మహిళ తన బంధువుతో కలిసి జార్ఖండ్ నుంచి గుజరాత్ వెళ్లేందుకు సూరత్ ఎక్స్ప్రెస్ ఎక్కింది. ఈ రైలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో కి చేరగానే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వేధించారు. అనుమతి లేకుండా ఫొటోలు తీశారు. దానికి ఆమె అభ్యంతరం తెలపడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారు ఆమె బంధువుపై దాడి చేశారు..
Also Read
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ఇక వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.. అయిన వదల్లేదు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాధితురాలిని, ఆమె బంధువునూ కదులుతోన్న రైల్లోంచే కిందికి తోసేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన వారు.. రాత్రంతా పట్టాల పక్కనే అపస్మారక స్థితిలో ఉండిపోయారు.. ఉదయం అటుగా వచ్చిన గ్రామస్థులు చూసి ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో జనాలు భయపడుతున్నారు.. ప్రభుత్వం ఇలాంటి వాటి పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు..
- Tags
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!