MP: 12 ఏళ్లు ఇంట్లోనే కూర్చుని రూ. 28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్ ఉదంతం బయటపడింది. ఈ కేసు 2011లో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారిది. నియామకం తర్వాత.. అతన్ని భోపాల్ పోలీస్ లైన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఆపై సాగర్ శిక్షణా కేంద్రానికి పంపారు. కానీ శిక్షణకు హాజరు కావడానికి బదులుగా, అతను విదిషలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఏ అధికారికి సమాచారం ఇవ్వలేదు లేదా సెలవు కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ తన సర్వీస్ ఫైల్ను స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్కు పంపాడు. ఆ ఫైల్ అక్కడికి చేరుకోగానే.. ఎటువంటి దర్యాప్తు లేకుండానే ఆమోదం పొందింది. భోపాల్ పోలీస్ లైన్లో ఎవరూ అతని విధులకు రావడం లేదని పట్టించుకోలేదు. దీంతో అతను జీతం పొందుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడూ విధులకు హాజరు కాలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 12 సంవత్సరాలుగా ఏ అధికారి కూడా ఈ అక్రమాన్ని గుర్తించలేకపోయారు.
READ MORE: BRICS Summit: బ్రిక్స్ సమ్మిట్కు హాజరైన ప్రధాని మోడీ.. అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు
Also Read
- Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
- Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
- Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ 'రాగి గంజి' తయారీ చేసుకోండి ఇలా.!
- Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
నివేదికల ప్రకారం.. ఒకే పోలీస్ స్టేషన్లలో చాలా కాలంగా పని చేస్తున్న పోలీసులను బదిలీ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఆదేశించారు. ప్రతి పోలీసు వివరాలను డిజిటలైజ్ చేయాలని అధికారులను కోరారు. దీంతో ఈ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ కానిస్టేబుల్ని పిలిపించి ఆరా తీశారు. తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అందువల్ల విధులకు హాజరుకాలేదని పేర్కొన్నాడు. మెడికల్ రిపోర్టును సైతం అందించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను భోపాల్లోని టీట నగర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఏసీపీ అంకిత ఖతార్కర్కు అప్పగించారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. “కానిస్టేబుల్ ఒంటరిగా శిక్షణకు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. కానీ శిక్షణకు రాలేదు. అతడి హాజరు సైతం నమోదు కాలేదు. ప్రస్తుతం అతడి నుంచి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన మొత్తాన్ని అతని రాబోయే జీతం నుంచి తీసుకుంటాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
Diwali Clash : దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు
-
Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
-
India Women History: టీ20 ప్రపంచకప్లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
-
ASUS Dawn 7S Ryzen Edition: 16GB RAM, Ryzen AI చిప్తో.. Asus Dawn 7S Ryzen Edition ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!