MP: టెన్షన్.. టెన్షన్.. దర్గాపై హిందూ జెండా ఎగరేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఓ దర్గాను ధ్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. అంతటితో ఆగకుండా ఆ ముస్లిం ప్రార్థనా స్థలంపై హిందూ జెండా ఎగరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఈ అంశంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Manda Krishna Madiga: పెన్షన్ పెంచుతావా గద్దె దిగుతావా? రేవంత్రెడ్డికి మంద కృష్ణ మాదిగ వార్నింగ్..
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని గోర్గి గ్రామంలో శుక్రవారం రాత్రి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఓ ముస్లిం ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాయి. వారు ఆ దర్గా గోపురంపై మతపరమైన (హిందూ)జెండాను ఉంచారు. శనివారం ఉదయం ముస్లిం సమాజానికి ఈ విషయం తెలిసింది. దీంతో అక్కడికి జనాలు భారీగా తరలి వచ్చారు. ఈ అంశంపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దెబ్బతిన్న దర్గా నిర్మాణ పనులను ప్రారంభించారు. గుర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోర్గి గ్రామంలో ముస్లిం సమాజ విశ్వాసానికి ప్రతీక అయిన ఘాజీ మియా సమాధి ఇందులో ఉంది. ఇది చాలా పురాతనమైనది అని చెబుతారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు ప్రార్థనలు సైతం చేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని చెబుతున్నారు. కానీ, రాత్రి సమయంలో కొంతమంది దుండగులు సమాధిని ధ్వంసం చేసి దానిపై మతపరమైన జెండాను ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!