Madhavaram Krishna Rao : కొంత మంది అసభ్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపు కొంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది అసభ్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.. ఇవాళ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్రలో చితరమ్మ బస్తి వద్ద 50 లక్షల విలువైన డబల్ బెడ్ రూములు ఈ ప్రాంతంలో కట్టించి ఇచ్చినందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ స్థానికులు మంచి నీరు నిరంతర విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయని ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అయితే కొంతమంది లబ్ధిదారులకు పింఛన్లు రావడం లేదని ఫిర్యాదు చేయగా వెంటనే సంబంధిత అధికారులకు వారికి పింఛన్లు అందేటట్లు ఏర్పాటు చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మంచినీరు, విద్యుత్ రోడ్లు వంటి ఇతర మౌలిక సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందిస్తున్నారని అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా లబ్ధిదారులందరికీ కూడా పథకాలు అందేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారని ఇందులో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.కొంతమంది అసత్య ప్రచారాలు చేసి వారి పబ్బం గడుపుకుంటున్నారని అటువంటి వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దు అని ప్రజలకు తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల వారు సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.బాలాజీనగర్ డివిజన్కు చెందిన బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు వీరంగంటి జ్యోతి జగదీష్ గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారవు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన జ్యోతికి కండువ కప్పి ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!