Madhavan Asks Apologises: ప్రముఖ నటుడు మాధవన్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) వివాదంలో చిక్కుకుంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘దశమ్ గ్రంధం’ లోని శ్లోకాలను చెబుతున్నపుడు మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై శివసేన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమాలో మాధవన్ ‘అజయ్ సన్యాల్’ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పాత్రను పోషించారు. ఒక సీన్ లో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్ర శ్లోకాలను చెబుతూ మాధవన్ ధూమపానం చేశారని.. ఇది సిక్కు సమాజపు మనోభావాలను, గురువాని గౌరవాన్ని దెబ్బతీసిందని ముంబైకి చెందిన సిక్కు నాయకుడు గుర్జీత్ సింగ్ ఖేర్ ములుండ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణలపై మాధవన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన “మా ధురంధర్ టీమ్ తరపున మీ ప్రేమకు ధన్యవాదాలు. అయితే, దశమ్ గ్రంథ్ లైన్లు చెబుతూ నేను సిగరెట్ తాగినట్లు వచ్చిన వార్తలు విని బాధపడ్డాను. కానీ, అది నిజం కాదు. సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ పవిత్రమైన లైన్లు చెప్పడానికి చాలా ముందే సిగరెట్ ఆర్పేయాలని ఆయన నాకు చెప్పారు. ఆ సీన్ లో నా నోటి నుండి పొగ రాదు, నా చేతిలో సిగరెట్ ఉండదు, ఫ్రేమ్లో ఎక్కడా ధూమపానం కనిపించదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Hyderabad Rain: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం
తాము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోము. వ్యక్తిగతంగా నేను నా ప్రతి సినిమా విడుదలకు ముందు గోల్డెన్ టెంపుల్కు వెళ్తాను. మాకు సిక్కు సమాజం అంటే ఎంతో గౌరవం ఉందని వివరణ ఇచ్చారు. సీన్ ప్రారంభంలో పాత్ర స్వభావం రీత్యా సిగరెట్ పట్టుకుని ఉండవచ్చని, కానీ పవిత్ర శ్లోకాలు పఠించే సమయంలో వాటిని పూర్తిగా దూరం పెట్టామని వివరించారు. అయినా కానీ మీకు తప్పు అనిపిస్తే క్షమించండి అంటూ మాధవన్ హుందాగా మాట్లాడారు.
