Arvind Kejriwal: రీట్వీట్ చేసి తప్పు చేశాను.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: బీజేపీ ఐటీ సెల్కు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. బీజేపీ ఐటీ సెల్ గురించి యూట్యూబర్ ధృవ్ రాఠి షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేయడం తన తప్పు అని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో అంగీకరించారు. గతంలో ఇదే వీడియోను రీట్వీట్ చేసినందుకు దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, కేజ్రీవాల్ తరపు న్యాయవాది తప్పును అంగీకరించడంతో, దిగువ కోర్టు చర్యపై కోర్టు ప్రస్తుతానికి స్టే విధించింది.
Read Also: BrahMos: రూ.19 వేల కోట్ల డీల్కు కేంద్రం ఆమోదం.. పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
ఢిల్లీ ముఖ్యమంత్రి క్షమాపణ చెబితే కేసును ఉపసంహరించుకుంటారా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఫిర్యాదుదారు వికాస్ సాంకృత్యాయన్ను ప్రశ్నించింది. కేజ్రీవాల్కు సంబంధించిన పరువు నష్టం కేసును మార్చి 11కి వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టును ఆదేశించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, వీడియోను రీట్వీట్ చేయడంలో తన క్లయింట్ (అరవింద్ కేజ్రీవాల్) చేసిన తప్పును అంగీకరించారు. పరువు నష్టం కలిగించే వీడియోను షేర్ చేయడం పరువునష్టం చట్టం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 5న తన తీర్పులో పేర్కొంది. పూర్తి సమాచారం లేకుండా వీడియోను రీట్వీట్ చేయడం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. పరువు నష్టం కలిగించే కంటెంట్ను రీట్వీట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
READ ALSO: Husbands Being Beaten: భర్తలను భార్యలు ఎక్కువగా చితకబాదేది ఎక్కడో తెలుసా..!
విచారణ సందర్భంగా, ఫిర్యాదుదారు వికాస్ సాంకృత్యాయన్ మనోభావాలను దెబ్బతీసేలా తన ట్వీట్ చేయలేదని కేజ్రీవాల్ వాదించారు. ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడానికి సరైన కారణం చెప్పలేదని, దాని ఆదేశాలలో సరైన న్యాయ విశ్లేషణ లేదని ఆయన అన్నారు. జర్మనీలో నివసిస్తున్న ధ్రువ్ రాఠి 2018 సంవత్సరంలో ‘బీజేపీ ఐటి సెల్ పార్ట్ II’ పేరుతో యూట్యూబ్ వీడియోను ప్రసారం చేశారని, అందులో తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు ఉన్నాయని పిటిషనర్ సాంకృత్యాయన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!