LPG Crisis: భారత్కు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న వేళ, ఉపశనం కలిగించే వార్త వెలువడింది. ముఖ్యంగా వంటగ్యాస్(LPG)కోసం దేశంలోని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి సమయంలో ఇరాన్తో భారత్ ఒప్పందాన్ని కదుర్చుకుంది. హార్ముజ్ జలసంధి మీదుగా రెండు LPG ట్యాంకర్లు భారత్ బయలుదేరాయి. ప్రస్తుతం వంటగ్యాస్ కొరతతో సతమతం అవతున్న భారత్కు ఇది పెద్ద ఊరట.
ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల తర్వాత ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసేయడంతో చాలా దేశాల్లో ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే, భారత్-ఇరాన్ మధ్య పలు దఫాల చర్చల తర్వాత డీల్ కుదిరింది.
దీనికి ముందు భారత్లోని ఇరాన్ రాయబాది మొహమ్మద్ ఫతాలి మాట్లాడుతూ… ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి సురక్షితమైన ప్రయాణాన్ని మంజూరు చేయవచ్చని సంకేతాలిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఇరాన్కు మిత్రదేశం’’ అని ఆయన అన్నారు. హార్ముజ్ ద్వారా భారత నౌకల రవాణాకు సంబంధించి సానుకూల తీర్మానం అతి త్వరలో రావచ్చని ఆయన చెప్పారు. సమయంలో తమకు అండగా నిలిచిందని ఇరాన్ రాయబారి చెప్పారు. భారత్ బహుళ రంగాల్లో తమకు మద్దతు అందించిందని చెప్పారు.