AP Weather : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని వర్షాలు వీడటం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2 రోజుల్లో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కోనసీమ, ఎన్టీఆర్ తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే.. అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24 గంటలో ఉత్తరాంధ్ర లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర అంతట వర్షాలు ఉంటాయని తెలిపారు. అయితే.. ఇవాళ అనకాపల్లి జిల్లా చోడవరం 11సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. తీరంలో 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్యకారుల వేట వెళ్లవెద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
West Bengal : రైలులో ఎమ్మెల్యే ప్రయాణం.. పక్కన ఉంది భార్య కాదా? షాక్ లో టీటీఈ
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
అయితే.. ఇటీవల కురిసిన వర్షాలకే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత ఐదు రోజులుగా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదలతో నిరాశ్రులైన వారిని ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆహారం, నిత్యావసర సరుకులు ఇలా అన్ని బాధితులకు సమకూర్చుతున్నారు. ఇప్పుడిప్పుడు కొంత ఉపశమనం కలుగుతుందనగా.. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఈ రోజు ఉదయం మరోసారి వర్షం కురిసింది. ఇదేకాకుండా.. బుడమేరుకు వరద పెరగడంతో బెజవాడ వాసుల్లో భయం మొదలైంది. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు సీఎం చంద్రబాబు. గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
Koneti Adimulam : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!