Lok Sabha Results 2024: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు పట్టు సాధిస్తున్నారు. చేవెళ్లలో ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి 559 ఓట్ల ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వరంగల్లో తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కడియం కావ్య 8404 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి వారికి 55 వేల 654 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొదటి రౌండ్ నుండి ముందంజలో ఉన్నారు.
దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి మాధవి లత ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆమె ముందంజలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెనుకంజలో ఉన్నారు. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ 8,852 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడా ప్రభావం చూపడం లేదు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి ముందంజలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు కౌటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు.
Also Read
వరంగల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి అరూరి రమేష్ 242 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఓట్లను కోల్పోయారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 19,935 ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సత్తా చాటిన ఈటల తొలి రౌండ్ లోనే 11 వేల మెజారిటీ సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత వెనుకబడ్డారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాద్లోనూ ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!