Devineni Uma: డీజీపీకి లేఖ రాసిన దేవినేని ఉమా.. అందులో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నామని లేఖలో పేర్కొ్న్నారు. “మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్ బూత్ లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు ఉదాసీనత వైఖరి వల్లే దాడి జరిగింది. బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజంట్ రేఖ్యానాయక్ ను బూత్ నుంచి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు బూత్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారు. నరసరావుపేట నియోజకవర్గంలో జీవనోపాధికోసం పని చేసుకునే డీజే శివపై రాడ్లు, కర్రలతో దాడి చేసి వైసీపీ రౌడీలు చావబాదారు. మాచర్లలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే రచించుకున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారు. టీడీపీ కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలి.” అని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
- Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
కాగా.. ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన దాడికి సంబంధించి పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందస్తు బెయిలు కోసం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ జరగగా.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు వారిపై ఏటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!