Devineni Uma: డీజీపీకి లేఖ రాసిన దేవినేని ఉమా.. అందులో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నామని లేఖలో పేర్కొ్న్నారు. “మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్ బూత్ లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు ఉదాసీనత వైఖరి వల్లే దాడి జరిగింది. బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజంట్ రేఖ్యానాయక్ ను బూత్ నుంచి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు బూత్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారు. నరసరావుపేట నియోజకవర్గంలో జీవనోపాధికోసం పని చేసుకునే డీజే శివపై రాడ్లు, కర్రలతో దాడి చేసి వైసీపీ రౌడీలు చావబాదారు. మాచర్లలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే రచించుకున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారు. టీడీపీ కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలి.” అని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కాటేరమ్మ కొడుకుతో వైభవ్ ఓపెనింగ్..
- Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
- Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
కాగా.. ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన దాడికి సంబంధించి పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందస్తు బెయిలు కోసం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ జరగగా.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు వారిపై ఏటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కాటేరమ్మ కొడుకుతో వైభవ్ ఓపెనింగ్..
-
Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
-
Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
-
Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..