Lineman Dead: విద్యుత్ షాక్ తో స్తంభంపైనే ప్రాణాలు వదిలిన లైన్ మెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో చేరిన ఏడు నెలల్లోనే ఓ జూనియర్ లైన్ మెన్ ను మృతువు కబళించింది. విద్యుత్ స్తంభం పై ఉంది వైర్లు సవరిస్తుండగా ఆ కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే జూనియర్ లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐకే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణానికి చెందిన బాల్ రాజు అనే వ్యక్తి గత అక్టోబర్ నెలలో మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి జూనియర్ లైన్ మెన్ గా నియామకమయ్యారు. ఇక అప్పట్నుంచి అతను విధులు నిర్వర్తిస్తున్నాడు.
Student Teacher Romantic Video: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ స్టెప్పులు..
Also Read
శుక్రవారం నాడు ఉదయం సమయంలో మల్లికార్జునపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో ఓ ప్రాంతంలో అంతరాయం ఏర్పడింది. దీనితో బాల్ రాజు విద్యుత్ తీగలు సరిచేసేందుకు స్థంభంపైకి ఎక్కి., అక్కడ స్తంభం పై విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ సరఫరా కావడంతో అనుకోకుండా షాక్ కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ తీగలలో చిక్కుకొని విద్యుత్ స్థంభం పైనే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటనతో అతని కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Diamond In Field: పొలంలో రైతుకి లభించిన విలువైన వజ్రం.. భారీ ధరకి..
మృతుడు బాలరాజు కు తల్లితండ్రులతో పాటు ఒక చెల్లి కూడా ఉంది. ఇక తండ్రి సంగారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..