Leopard in Hetero Labs: హెటిరో ల్యాబ్స్ లో చిరుత కలకలం.. ఉద్యోగుల టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరుతలు అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో చిరుతపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఓ చిరుత తన ప్రతాపం చూపుతోంది. Hetero పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో Hetero పరిశ్రమలో చిరుత సంచారం ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. Hetero పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో దాగి చిరుత దాగి ఉందని తెలుస్తోంది.

Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Read Also: Clashes in Macherla: మాచర్ల ఘటన ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కంపెనీలోకి చిరుత ప్రవేశించిందంటున్నారు. ఆ చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు కార్మికులు. చిరుతను బంధించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
హెటిరో పరిశ్రమకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. DFO శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు.. ఎవరూ బయటకు రావద్దంటున్నారు. భయంతో బిక్కు బిక్కు మంటున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు. ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులుల సంచారం వెలుగులోకి వచ్చింది. వారంరోజుల తర్వాత మల్లీ పులులు రోడ్డుపై కనిపించడం కలకలం రేపుతుంది. పిప్పల్ కోఠి రిజర్వాయర్ వద్ద వాహనం డ్రైవర్ పులులను వీడియో తీసాడు..ప్రస్తుతం పులుల వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాదముద్రల సేకరించారు.
పులుల సంచారం నిజమే అని ధృవీకరించారు అటవీశాఖ అధికారులు. నడిరోడ్డుపై నాలుగు పులులు కనిపించగా అప్పుడు సైతం ఓ వాహనం డ్రైవర్ వీడియో తీయగా అవి సైతం వైరల్ అవుతున్నాయి..పులుల సంచారంతో తాంసికే,గోల్లఘాట్ ,పిప్పల్ కోఠి గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొమురం భీం జిల్లాలోని పెంచికల్ పేట ,బెజ్జూర్ మండలాల్లో పులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
Read Also:Fire Accident in Oil Mill: అయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!