Clashes in Macherla: మాచర్ల ఘటన ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clashes in Macherla: పల్నాడు జిల్లా మాచర్ల అగ్నిగుండంలా మండిపోతోంది. వైసీపీ కార్యకర్తల విధ్వంసంతో మాచర్లలో హింస పేట్రేగింది. అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబుతో పాటు టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్లకు తెల్లవారుజామునే పోలీసులు చేరుకున్నారు. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో వారిని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. కాగా ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Read Also: RBI Shock: రేజర్పే, క్యాష్ఫ్రీకి RBI షాక్.. తాత్కాలిక ఆంక్షలు
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
అటు శుక్రవారం నాడు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన అపార్టుమెంట్లోని 8 కార్లను ధ్వంసం చేశారు. వీటిలో మూడు కార్లు టీడీపీ నేతలవి కాగా మిగిలిన నాలుగు అపార్టుమెంట్ వాసులకు చెందిన కార్లు అని తెలుస్తోంది. అంతేకాకుండా రెండు ప్లాట్లలోకి వైసీపీ నేతలు జొరబడి ధ్వంసం చేశారు. లోపలుండి ఇళ్లకు తాళాలేసినా పగులకొట్టి ఫ్లాట్లల్లోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి ఐరన్ డోర్లని విరగొట్టి లోపలకొచ్చి ధ్వంసం చేశారు. తమ ఇంట్లో జొరబడి రూ. లక్ష నగదు, 15 తులాల బంగారం దోచుకెళ్లారని టీడీపీ కార్యకర్త భార్య ఆరోపించారు. కాగా గొట్టిపాల, వెల్దుర్తి గ్రామాల నుంచి కొన్నేళ్ల క్రితమే బాధితులు మాచర్లకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధు అనే కార్యకర్త భార్యపై రాడ్లతో దాడి జరిగింది. శనివారం ఉదయం వరకు ఫ్లాట్ల వద్దకు రాని పోలీసులు తీరిగ్గా కాసేపటి క్రితమే వివరాల సేకరణకు వచ్చారు. అయితే తాము ఫిర్యాదు చేసినా లాభం ఏముంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!