Clashes in Macherla: మాచర్ల ఘటన ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clashes in Macherla: పల్నాడు జిల్లా మాచర్ల అగ్నిగుండంలా మండిపోతోంది. వైసీపీ కార్యకర్తల విధ్వంసంతో మాచర్లలో హింస పేట్రేగింది. అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబుతో పాటు టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్లకు తెల్లవారుజామునే పోలీసులు చేరుకున్నారు. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో వారిని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. కాగా ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Read Also: RBI Shock: రేజర్పే, క్యాష్ఫ్రీకి RBI షాక్.. తాత్కాలిక ఆంక్షలు
Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
అటు శుక్రవారం నాడు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన అపార్టుమెంట్లోని 8 కార్లను ధ్వంసం చేశారు. వీటిలో మూడు కార్లు టీడీపీ నేతలవి కాగా మిగిలిన నాలుగు అపార్టుమెంట్ వాసులకు చెందిన కార్లు అని తెలుస్తోంది. అంతేకాకుండా రెండు ప్లాట్లలోకి వైసీపీ నేతలు జొరబడి ధ్వంసం చేశారు. లోపలుండి ఇళ్లకు తాళాలేసినా పగులకొట్టి ఫ్లాట్లల్లోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి ఐరన్ డోర్లని విరగొట్టి లోపలకొచ్చి ధ్వంసం చేశారు. తమ ఇంట్లో జొరబడి రూ. లక్ష నగదు, 15 తులాల బంగారం దోచుకెళ్లారని టీడీపీ కార్యకర్త భార్య ఆరోపించారు. కాగా గొట్టిపాల, వెల్దుర్తి గ్రామాల నుంచి కొన్నేళ్ల క్రితమే బాధితులు మాచర్లకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధు అనే కార్యకర్త భార్యపై రాడ్లతో దాడి జరిగింది. శనివారం ఉదయం వరకు ఫ్లాట్ల వద్దకు రాని పోలీసులు తీరిగ్గా కాసేపటి క్రితమే వివరాల సేకరణకు వచ్చారు. అయితే తాము ఫిర్యాదు చేసినా లాభం ఏముంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..