Left Parties Meeting: మోడీ, జగన్ పోటీపడుతూ జనాన్ని దోచేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో వామపక్ష పార్టీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ …దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారతదేశం మరో శ్రీలంక తరహాలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడతాయన్నారు.
ఈనెల 25వ తేదీన సచివాలయాల వద్ద నిరసన చేపడతున్నాం. ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ఏపీలో జగన్ పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలను ప్రశ్నించలేని దుస్థితి లో జగన్ ఉన్నారు. రాష్ట్రంలో పన్నులు, విద్యుత్ భారాలు పెంచారు. జగన్ మోడీ కనుసన్నల్లోనే పని చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ మోసం చేశారు. పొరాటాల ద్వారా పాలకుల్లో మార్పు రావాలన్నారు. ప్రజలు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై గళమెత్తాలి.
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్ పెంచారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ..రెండు ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఏపీలో పెట్రోల్, గ్యాస్ ధరలే కాదు సిమెంట్, ఇసుక, ఐరన్ ధరలు పెంచేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ధరలు ఎక్కువ.
Read Also: Chandrababu : జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్
ఆస్తి పన్ను 32శాతం పెంచారు, చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది. విద్యుత్ ఛార్జీలు పెంచి కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. అదానీ కంపెనీతో కుమ్మక్కై, వారిచ్చే కమిషన్ల కోసం ప్రజలపై విద్యుత్ భారాలు మోపారు. ప్రతిపక్షంలో విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్తును రాజస్థాన్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయలేరా..? డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. ప్రయాణికులపై భారం మోపారు.
ఇన్ని రకాలుగా భారాలు మోపినా.. 24 గంటలూ విద్యుత్ ఇవ్వలేక పోతున్నారు.మే 1వ తేదీ నుండి కరెంటు ఎలా వస్తుందో మంత్రి చెప్పాలి.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం విద్యుత్ కొనలేని స్థితిలో ఉంది.మోడీ, జగన్ పోటీ పడుతూ ప్రజలను దోచుకుంటున్నారు.అన్ని రకాల ఛార్జీలు, పన్నుల భారాలు తగ్గించాలి.ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!