ఆర్థిక సంక్షోభం అలాగే 2023లో ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి.. నిన్న ప్రముఖ కంపెనీ పేటీఎం వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో అంతర్జాతీయ కంపెనీ వందలాది మందిని తొలగించనున్నట్లు తెలిపింది..
ఇకపోతే గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్.. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను వెల్లడించింది. ‘ది గార్డియన్’ నివేదికల ప్రకారం.. లేఆఫ్ల అమలు, కొన్ని సేవలలో ఆటోమేషన్ను పెంచడం ద్వారా 2 బిలియన్ డాలర్లు (రూ.16 వేల కోట్లకుపైగా ) ఆదా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.. అందుకే ఇప్పుడు ఉద్యోగుల పై ఊచకొత మొదలు పెట్టింది..
గత ఏడాది లో ఈ కంపెనీ అమ్మకాలలో తిరోగమనాన్ని ఎదుర్కొన్న ఈ కంపెనీ, సంస్థాగత క్రమబద్ధీకరణ అవసరానికి అనుగుణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. తొలగిస్తున్న ఉద్యోగులకు చెల్లించే సీవరెన్స్ ప్యాకేజీల కోసం 450 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.3,742 కోట్లు)ను కేటాయించునుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో 700 మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత నైక్ చేపడుతున్న రెండో లేఆఫ్ ఇది.. ఇక ఇప్పటిలో కొత్త వాళ్లను కూడా తీసుకొనే ఆలోచనలో లేదని సమాచారం…