T. Harish Rao: నారాయణ్ ఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు
పట్ట భద్రుల సీట్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. “రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీ గెలిపించాలి. కాంగ్రెస్ పాలనాలోఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. రైతాంగాన్ని నిలువునా మోసం చేసింది. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్, అమలు చేసుడు విస్మరించింది. విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు తో బుద్ధి చెప్పాలి. ఉపాధ్యాయులపై నారాయణ ఖేడ్ లో లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు. వడ్లకు బోనస్ ఎగ గొట్టిన కాంగ్రెస్ రైతు బిడ్డలు బుద్ధి చెప్పండి. సంక్షేమ పథకాలలో కోతలు, ధరలు పెంచి వాత పెడుతున్న రేవంత్ కు విద్యా వంతులు బుద్ధి చెప్పాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన..
Also Read
- Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
కరెంట్, రిజిస్ట్రేషన్ ఫీజు, భూముల ధరలు పెంచాలనే యోచన చేస్తుందని తన్నీరు హరీష్ రావు అన్నారు. ” తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది. ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేయాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ కి వాత పెట్టాలి. తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ ను బలపర్చాలి. తెలంగాణ ఉద్యమ కార్లపై తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్ కు పట్ట భద్రులు ఓటు వేయొద్దు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలి. తెలంగాణ నీళ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించాలని బీజేపీ కుట్రలకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోంది. 2వేల పడకల ఆసుపత్రి చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ చిహ్నం ను తొలగించాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పంటలు కోనేటోళ్ళు లేరు, కరెంట్ సరఫరాలో విఫలమయ్యారు. కాంగ్రెస్ అబద్దాలు, మోసాలను ప్రశ్నించడం రాకేష్ రెడ్డి కి సాధ్యం?” అని హరీష్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
-
Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
-
SRH Captain: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
-
Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
-
Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!