T. Harish Rao: నారాయణ్ ఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్ట భద్రుల సీట్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. “రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీ గెలిపించాలి. కాంగ్రెస్ పాలనాలోఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. రైతాంగాన్ని నిలువునా మోసం చేసింది. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్, అమలు చేసుడు విస్మరించింది. విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు తో బుద్ధి చెప్పాలి. ఉపాధ్యాయులపై నారాయణ ఖేడ్ లో లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు. వడ్లకు బోనస్ ఎగ గొట్టిన కాంగ్రెస్ రైతు బిడ్డలు బుద్ధి చెప్పండి. సంక్షేమ పథకాలలో కోతలు, ధరలు పెంచి వాత పెడుతున్న రేవంత్ కు విద్యా వంతులు బుద్ధి చెప్పాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
కరెంట్, రిజిస్ట్రేషన్ ఫీజు, భూముల ధరలు పెంచాలనే యోచన చేస్తుందని తన్నీరు హరీష్ రావు అన్నారు. ” తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది. ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేయాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ కి వాత పెట్టాలి. తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ ను బలపర్చాలి. తెలంగాణ ఉద్యమ కార్లపై తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్ కు పట్ట భద్రులు ఓటు వేయొద్దు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలి. తెలంగాణ నీళ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించాలని బీజేపీ కుట్రలకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోంది. 2వేల పడకల ఆసుపత్రి చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ చిహ్నం ను తొలగించాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పంటలు కోనేటోళ్ళు లేరు, కరెంట్ సరఫరాలో విఫలమయ్యారు. కాంగ్రెస్ అబద్దాలు, మోసాలను ప్రశ్నించడం రాకేష్ రెడ్డి కి సాధ్యం?” అని హరీష్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!