Godavari Flood: గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో లంక గ్రామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Flood: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది.. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 12.5 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 80 వేల 223 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ వద్ద గోదావరి వరద మరింత పెరగనుంది. బ్యారేజీ మొదటి ప్రమాద హెచ్చరికను మించి వరద ప్రవాహం కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Read Also: Liver Disease: రాత్రి అకస్మాత్తుగా మేల్కొంటున్నారా? ఇది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు
Also Read
- SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
- KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి. తమ్మిలేరులో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. తమ్మిలేరు జలాశయానికి 2వేల 890 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా.. ప్రస్తుతం 343 అడుగులకు చేరింది.. వర్షాలు మరింత పెరిగితే దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. భారీ వర్షాలతో ఇప్పటికే తమ్మిలేరు ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల గట్లు కోతకి గురి కావడంతో ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో అనే భయంలో ఉన్నారు. ఇక, కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయ పాయలు ఉప్పొంగడంతో.. జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి లంక గ్రామాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఉధృతంగా శబరి గోదావరి నదులు ప్రవహిస్తుండగా.. కూనవరం వద్ద ప్రమాదకర స్థాయిలో శబరి బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది శబరి నది.. కూనవరం మండలం పొలిపాక వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది.. చింతూరులో 38 అడుగుల వద్ద ఉధృతంగా శబరి నది ప్రవహిస్తుండగా.. కూనవరం వద్ద 47 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం.. ఇక, వీఆర్ పురం, చింతూరు మండలాల మధ్య రాకపోకలు తెగిపోయాయి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
-
Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!